వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పట్టుబడిన గంజాయి

వరంగల్, సెప్టెంబర్ 2:
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్ కంట్రోల్ టీం  భారీ గంజాయి అక్రమ రవాణా ప్రయత్నాన్ని భగ్నం చేసింది. కొత్తగూడ మండలం చిలకమ్మనగర్ సమీపంలోని చిలుకలగుట్ట వద్ద ముఠా దాచిపెట్టిన గంజాయిని స్వాధీనం చేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే డ్రగ్స్ కంట్రోల్ టీం ఖానాపూర్ ఎస్‌.ఐ. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడ నలుగురు వ్యక్తులు సంచులు మోస్తుండగా పట్టుబడ్డారు.
విచారణలో వారిని అందాల పాండు రెడ్డి (30, తూర్పుగోదావరి జిల్లా), గుళ్లారి మునిరాజ్ (30, ఒడిశా రాష్ట్రం), కొప్పు కోటయ్య (28, మల్కానగిరి జిల్లా), **భూక్య సాయికుమార్ (31, సూర్యాపేట జిల్లా)**గా గుర్తించారు.
ఇవాళ్టి వరకూ వీరు గంజాయి రవాణాలో పాలుపంచుకుంటూ   వేలకు వేలు సంపాదించేవారణి  విచారణలో వెల్లడించారు.
ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు రమేష్, మజ్జి కృష్ణ గంజాయి సాగు చేసి కొనుగోలు దారులకు అమ్ముతూ ఉండేవారని పోలీసులు తెలిపారు.


తాజాగా, గుట్టపై దాచిన గంజాయిని సాయికుమార్ పార్టీకి అప్పగించే సమయంలో పోలీసులు దాడి చేసి, 23 సంచుల్లో మొత్తం 763.845 కిలోల ఎండు గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.81 కోట్లుగా అంచనా వేసారు.
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్‌.ఐ. శివాకేశవులు, ఏఏఓ సల్మాన్ పాషా, ఆర్‌.ఎస్‌.ఐలు పూర్ణచందర్, మనోజ్, నాగరాజు, ఏ.ఎస్‌.ఐ సుబ్బిరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నజీర్ అహ్మద్, రజాన్ పాషా, రబ్బానీ, అమరేశ్వర్, రాజ్‌కుమార్, జావీద్, రమేష్, సృజన్, బాలాజీ, రాంచందర్లను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
🔹 కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన నిందితులను చట్టరీత్యా రిమాండ్ కు తరలించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి
అమెరికా డాలర్ కు ఆవలివైపు….
మోడీకి ట్రంప్ చిక్కుముడి