ఆపరేషన్ సిందూర్” సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత, శాంతి భద్రతలపై దృష్టి
హైదరాబాద్,మే07,2025: దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్”పై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “దేశ సైన్యంతో మనమంతా ఉన్నాం” అనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపేలా అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని స్పష్టం చేసిన సీఎం… అత్యవసర సేవల విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. “ప్రతి ఉద్యోగి, మంత్రి, అధికారి అందుబాటులో ఉండాలి,” అని ఆయన పేర్కొన్నారు.
తీసుకోవాల్సిన కీలక చర్యలు:
విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేయాలి.
- ప్రభుత్వ ఉద్యోగులు మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా అసత్య సమాచారం ఇవ్వకూడదు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటాం.
- 24 గంటల ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి.
- పాక్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి అక్రమంగా ఉన్నవారిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలి.
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి.
- శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యం, భద్రత పై ప్రత్యేక దృష్టి:
- బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉంచాలి.
- అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి.
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల సమాచారం తరచూ సమీక్షించాలి.
- రెడ్ క్రాస్ సహకారంతో సమన్వయం చేసుకోవాలి.
- ఆహార నిల్వలు తగినంతగా ఉండేలా చూడాలి. ఫేక్ న్యూస్ పై ఉక్కు పాదం:
- ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంది.
- అలాంటి వార్తలను అడ్డుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
- సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా ఉండాలి. నగర భద్రతపై సీఎం ఆదేశాలు:
- రాజధాని లోని మూడు కమిషనరేట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేయాలి.
- సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచాలి.
- హైదరాబాద్లోని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల వద్ద భద్రతను పెంచాలి.
- అవసరమైతే పీస్ కమిటీతో చర్చలు జరిపాలి.
- హిస్టరీ షీటర్లపై, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలి.
సంఘటితంగా, సమర్థవంతంగా స్పందిస్తేనే శాంతి భద్రతలు కాపాడగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.