ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
ఇరాన్ కు ఇస్లామిక్ దేశాలు ఎందుకు దూరమయ్యాయి
అమెరికా - ఇజ్రాయిల్ ల దాడిలో ఇరాన్ సుప్రీం అలీ ఖొమైనీ దుర్మరణం చెందాడు. పదుల సంఖ్యలో ఉన్నత శ్రేణి నాయకులు, వందలాది పౌరులు మరణించారు. ఆర్థికంగా, సాంస్కృతికంగా , చారిత్రకంగా ఘన చరిత్ర కలిగిన ఇరాన్ దేశం ఒకప్పుడు ప్రపంచంలో కీలక నాయకత్వ పాత్ర వహించింది. ఇక, భారత దేశంలాంటి ఎన్నో పెద్ద, ప్రముఖ దేశాలు ఇరాన్ కు స్ట్రాంగ్ సపోర్టర్గా ఉండేవి. కానీ, గత కొన్ని రోజులుగా ఇరాన్ పై అమెరికా, దాని మిత్రదేశాలు బాంబుల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నా, ప్రపంచంలోని ఏఒక్క పెద్ద దేశం గానీ, ఇస్లామిక్ దేశాలు కానీ, బహిరంగంగా వ్యతిరేకించలేదు. ప్రధానంగా యూరప్, రష్యా , చైనా, ఇండియా, ఇటలీ, బ్రిటన్ , ఫ్రాన్స్, జపాన్ , ఆస్ట్రేలియా లతో పాటు మధ్య ప్రాచ్య దేశాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి.
ప్రపంచంలో ఉన్న దాదాపు 57 ఇస్లానిక్ దేశాలు ఉంటె, కనీసం 10 దేశాలు కూడా ఇరాన్ విషయంలో స్పందించ లేదు. ఇస్లానిక్ దేశాలతో పాటు ఇతర ప్రముఖ దేశాలు స్పందించనప్పుడు భారత్ ఎందుకు స్పందించాలన్న అంశం కూడా చర్చకు వస్తోంది. స్పందించలేదు కూడా . ఇరాన్ తో ఇండియా దాదాపు ఐదు శతాబ్దాల కు పైగా అనుబంధం ఉంది. ఇక, హైదరాబాదుతో కూడా ఇంతే అనుబంధం ఉంది. హైదరాబాద్ నగర స్థాపన (1591) కూడా పర్షియన్ నగర నిర్మాణ ప్రభావంతో జరిగింది. ఇరాన్ సంస్కృతీ, ఇరానియన్ నిర్మాణ శైలి, జీవన విధానంతో హైదరాబాద్ కు అనుబంధం ఉంది. అంతెందుకు, ఇరానీ ఛాయ్ తో ఇక్కడి ప్రజలకు ఉన్న అనుబంధం ఇక చెప్పలేం. ఇంతటి, అనుబంధం చారిత్రక నేపధ్యం కలిగిన ఇండియా ఇరాన్ పై మౌనముగా ఎందుకుందనే అనుమానం అందరిలోను ఉంది. అయితే, గత పదేళ్లుగా భారత్ పై ఇరాన్ వైఖరి మారుతూ వచ్చింది. ప్రధానంగా పాకిస్తాన్, చైనా దేశాలతో దగ్గరవుతూ, ఇండియా పై వ్యతిరేక ప్రచారం చేయడంలో నిరంతరం పనిచేస్తూ వచ్చింది. ప్రధానంగా ఇండియా లో పెద్ద ఎత్తున ముస్లీములను హతం చేస్తున్నారని, కాశ్మీర్ కు వ్యతిరేకంగా, ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా, CAA కు వ్యతిరేకంగా ఇరాన్ పలు వేదికల ద్వారా ఇండియా పై విషం చిమ్ముతూ వచ్చింది.
గాజా, మయన్మార్ లలో ముస్లీమ్ లపై జరుగు తున్న మాదిరి దురాగతాలు ఇండియా లోనూ జరుగుతున్నాయని, భారత్ లోని ముస్లీములను రెచ్చగొట్టి ఇక్కడి ముస్లీములు ప్రశాంతంగా లేరనే ప్రచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లీములలో ఒక రకమైన అభిప్రాయాన్ని తెస్తూ వస్తోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లీములలో ఇండియాలోని ముస్లీములే ప్రశాంతంగా, స్వేచ్ఛగా , భయం లేకుండా ఉన్నారనేది వాస్తవం.
ఈ పరిస్థితుల దృష్యా క్రమక్రమంగా ఇండియా, ఇరాన్ ల మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక, మధ్య ప్రాశ్చ్య దేశాలలో ఒక ఒమాన్ తప్ప మిగిలిన అన్ని దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తూ విరుచుక పడుతోంది. దీనికి , ఆయా దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడమే కారణంగా పేర్కొంటున్నారు. యూఎస్ - ఇజ్రాయెల్ పై ప్రతికార దాడుల్లో ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. ఒక్క ఒమన్ ని మాత్రం టచ్ చేయలేదు... కారణం దౌత్యంలొ ఒమన్ అమెరికాకు ఇరాన్ లకు సమాన ప్రాధాన్యత ఇవ్వటమే కారణం... చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల మిద దాడి చేస్తూ ఒమన్ ని వదలటం ఎంత కష్టమైనా సరే టచ్ చేయలేదు... మతం ఏదైనా స్నేహం విలువైనది.. ఒమన్ స్నేహ భావంతొ నడిచే దేశం ... గతంలో వీళ్ళిద్దరూ ను కలిపే ప్రయత్నం లొ మధ్యవర్తిత్వం వహించింది. ఇక్కడ అమెరికా కు సైనిక స్థావరం లేదు. లేదు అనటం కన్న ఒమన్ ఇవ్వలేదు అనటం నిజం... చుట్టూ ఉన్న బహ్రయిన్ , కువైట్, ఖతార్, UAE, సౌదీ --అమెరికా కు మద్దతు ఇస్తున్నాయి. అమెరికా కు సైనిక స్థావరాలు ఉన్నాయి ఈ దేశాల్లో.. .. చిన్న దేశం స్నేహ భావం కలిగి దేశం ఒమన్.. మన భారతీయులు 9 లక్షల మంది ఉన్నారు. ఇది ప్రధాన కారణం.
మరో విషయమ్ ఏమంటే, ఖొమైనీ మరణాన్ని ఇరాన్ లోని యువత, మహిళలు ఉత్సవాలను జరుపుకున్నట్టుగా ఫోటోలు కూడా వచ్చాయి. ప్రధానంగా చెప్పేదేమంటే, శాస్త్ర సాంకేతిక ఒక రేంజ్ కు వెళ్తున్న ప్రస్తుత కాలంలోమారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారక ఛాందసంగా వెళ్లడం వల్లనే ఇరాన్ కు జరుగుతున్నా పరిణామాలే అన్ని ఉదాహరించవచ్చు.
కె. వెంకట రమణ . తేదీ. 3.3.2026


Fantastic beat ! I would like to apprentice while you amend your web site, how can i subscribe for a blog web site? The account aided me a acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast provided bright clear idea
z513vw