ఇప్పటికీ ఎవరివద్దనైనా రూ. 2,000 నోట్లు ఉన్నాయా? చెలామనిలో లేవని వాటిని చిత్తుకాగితాల్లో పడేయకండి. రూ.2000 నోట్లు చెలామనిలో లేకపోయినా రిజర్వు బ్యాంకాఫ్ ఇండియా సమాచారం మేరకు ఇంకా చట్టబద్దమైన విలువ కలిగి ఉన్నట్లే.
ఇప్పటికి ఎవరివద్దనైనా రూ.2000 నోట్లు ఉండి ఉంటే మీరు నేరుగా ప్రధాన నగరాల్లో ఉన్న రిజర్వుబ్యాంకాఫ్ ఆఫ్ ఇండియా కార్యాలయాలకు వెళ్లి వాటిని మీబ్యాంకు ఖాతాలలో జమచేసుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలో 19 నగరాలలో ఇలాంటి సదుపాయం ఉంది. అహ్మదాబాద్ • బెంగళూరు • బేలాపూర్ • భోపాల్ • భుబనేశ్వర్ • చండీగఢ్ • చెన్నై • గౌహతి • హైదరాబాద్ • జైపూర్ • జమ్మూ • కాన్పూర్ • కోల్కతా • లక్నో • ముంబై • నాగపూర్ • న్యూ ఢిల్లీ • పాట్నా • తిరువనంతపురం.
- ఆర్ బిఐ కార్యాలయాలలో మార్చుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల వారు హైదరాబాద్ ఆర్ బిఐ లో జమచేసుకోవచ్చు.

ఒకవేళ మీరు ఆర్బిఐకివెళ్లలేని పరిస్థితిలో మరోసౌలభ్యం కూడఉంది. మీసమీపంలోని పోస్టల్ కార్యాలయం ద్వారా ఆర్బిఐకి రూ2000 నోట్లను పంపుకుని మీబ్యాంకు ఖాతాల్లో జమచేసుకునే సౌలభ్యం కూడ ఉంది. పోస్టల్ కార్యాలయాల్లో వివరాలుఅడిగితేచెబుతారు. ఇందుకోసం బ్యాంకుఅక్కౌంట్ వివరాలతో ఒకఫాం నింపి నోట్లను జతచేయాల్సిఉంటుంది.
ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 98.08% తిరిగి వచ్చాయి. అయినప్పటికీ, మిగిలిన నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన చెల్లుబాటు కలిగి ఉన్నాయి. ఈ నోట్లను డిపాజిట్ చేయడం, మార్చుకోవడం సాధారణంగా కుదరదు.
2016 నవంబర్ లో కేంద్రం వెయ్యి,ఐదువందల నోట్లను రద్దు చేసింది. అనంతరం అధిక విలువ కలిగిన రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. తర్వాత 2023లో ఈ నోట్లను చెలమాని నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. 23 అక్టోబర్ 2023 వరకు అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను స్వీకరించారు. ఆ తర్వాత ఈనోట్లను బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం లేదు. ఆర్ బిఐ ప్రధాన కార్యాలయాల్లో బ్యాంకు అక్కౌంట్లలో జమచేసుకునే అవకాశం కొనసాగుతొంది.
ఇప్పటికి తిరిగిరాని లెక్కల్లో 6,266 కోట్ల రూ2000 నోట్లు ఉన్నాయి. చెలామని ఉహసంహరణ తర్వాత 98.24 శాతం నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.
ఏ పరిస్థితిలోనైనా మీ దగ్గర రూ2000 నోట్లుు ఉంటే లేదా మీరు నిశ్చింతగా వాటిని ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో జమచేసుకోవచ్చు.