హనుమకొండలో 9999 ఫ్యాన్సీ నంబర్కు రూ.12.60 లక్షల బిడ్ –దక్కించుకున్న కావేరీ ఇంజనీరింగ్ యజమాని
హనుమకొండ:వాహనాల ఫ్యాన్సీ నంబర్ల క్రేజి బాగాపెరిగి పోయింది. హనుమకొండలో వాహన నంబర్ వేలంలో TGA 03A 9999 అనే ఫ్యాన్సీ నంబర్కు రూ.12.60 లక్షల భారీ ధర పలికింది. ఈ నంబర్ను హనుమకొండకు చెందిన కావేరీ ఇంజనీరింగ్ సంస్థ సొంతం చేసుకుంది.
ఆర్టీఏ అధికారులు చింతగట్టు క్యాంపులో నిర్వహించిన వేలంలో ఈ నంబర్ కోసం చాలా మంది పోటిపడ్డారు. ముందుగా రూ.50,000 బేస్ ధరగా నిర్ణయించినప్పటికీ, నంబర్పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో బిడ్లు లక్షల్లో దూసుకెళ్లాయి. మే 27న జరిగిన ఆన్లైన్ వేలంలో కావేరీ ఇంజనీరింగ్ సంస్థ ఏకంగా రూ.12.60 లక్షలు చెల్లించి ఈ నంబర్ను దక్కించుకుంది.
ఈ నంబర్ కోసం పలువురు రూ.12 లక్షల వరకు బిడ్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు. చివరికి అత్యధిక బిడ్ ఇచ్చిన కావేరీ ఇంజనీరింగ్కి ఇది దక్కింది. ఇంతక్రేజీనా ఈధరతోమరోకారువచ్చేదికదా అంటూ ఈవార్త విన్నవారంతా కామెంట్లు చేశారు.