Headlines

లంచం తీసుకుంటూ పట్టబడిన రాయికల్ మండల ఇన్ చార్జి తహశీల్ దార్

acb rides

జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇంచార్జ్ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న జటంగుల గణేష్ లంచం తీసుుకంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. మహ్మద్ ముజఫర్ అనే ఓ ప్రైవేట్ దస్తావేజు లేఖకుడి ద్వారా రూ.పదివేల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.

ఓ రైతుకుసంభందించిన వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. లంచ గొండి అధికారి విషయం ఎసిబి అధికారులకు పిర్యాదు చేయగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ అధికారి అయినా లేదా ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని అధికారులుకోరారు. వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునితెలిపారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE