జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇంచార్జ్ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న జటంగుల గణేష్ లంచం తీసుుకంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. మహ్మద్ ముజఫర్ అనే ఓ ప్రైవేట్ దస్తావేజు లేఖకుడి ద్వారా రూ.పదివేల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
ఓ రైతుకుసంభందించిన వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. లంచ గొండి అధికారి విషయం ఎసిబి అధికారులకు పిర్యాదు చేయగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ అధికారి అయినా లేదా ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని అధికారులుకోరారు. వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునితెలిపారు.