ఖమ్మం జిల్లా గ్రామీణ సబ్-రిజిస్ట్రార్ – జెక్కి అరుణ డాక్యుమెంట్ రైటర్ – పుచ్చకాయల వెంకటేష్ లను ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడు తనవ్యవసాయ భూమిని తన కుమారుడి పేరుమీద గిఫ్ట్ డీడ్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ 50వేల లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదు దారుడు తొలుత 30వేలు ఇచ్చేందుకు అంగీకరించి ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసారు. దాంతో అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో డాకుమెంట్ రైటర్ నుసబ్ రిజిస్ట్రార్ ను పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి అదికారి అయినా లంచం అడిగినట్లయితే తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని “. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ ( @TelanganaACB ) మరియు వెబ్ సైట్ ( ttps://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చుని ఎసిబి అధికారులు తెలిపారు.
“ఫిర్యాదుదారులు , బాధితుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు.
MERYTRH1106176MAERWETT