మణుగూరు ఎస్ ఐ రంజిత్ పై ఏసీబీ కేసు నమోదు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ ఐ లంచం కేసులో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసారు. సబ్‌–ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బత్తిని రంజిత్‌ ఓ కేసులో నిందితులకు సహకరించేందుకు 40 వేల లంచం డిమాండ్ చేసాడు.
ఫిర్యాదుదారుడు అతని సోదరుడిపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా నోటీసు జారీ చేయాలంటే రూ.40,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో భాదితుడు ఏసీబీ ని అశ్రయించాడు.

భాదితులు సెప్టెంబర్ 19 న లంచం ఇచ్చేందుకు వెళ్లగా ఎస్ ఐ కి అనుమానం వచ్చి వారి నుండి డబ్బులు తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో ఆడియో, వీడియో ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఎస్‌ఐ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండు కు తరలించారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో