వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిని లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేసిన అనిశా అధికారులు
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల వ్యవసాయ అధికారి భూపతి జయశంకర్ లంచం తీసుకుంటూ అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు పట్టుబడ్డారు.
ఓ ఎరువుల డీలర్ కు చెందిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణానికి లైసెన్స్ జారీ చేయడంలో సహాయం చేయడానికి భూపతి జయశంకర్ మొదటగా రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ మొత్తంలో రూ.50,000/- స్వీకరిస్తూ ఉన్న సమయంలో అనిశా అధికారులు అతడిని పట్టుకున్నారు.
ప్రజలకు అనిశా అధికారులు విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వ సేవకులు లంచం కోరినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని తెలిపారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.
అదే విధంగా, ఫిర్యాదుదారుల మరియు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అనిశా స్పష్టం చేసింది.


erhime
Great site. Lots of helpful information here. I am sending it to several pals ans additionally sharing in delicious. And naturally, thank you to your sweat!