ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి

యూరియా సరఫరాకు లంచం డిమాండ్‌

వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ జిల్లా వ్యవసాయ అధికారి తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారునికి ఎలాంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా ఎరువు (యూరియా) సరఫరా చేయడానికి గాను రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో ముందుగా రూ.3,000 లంచంగా స్వీకరించిన అధికారి, మిగిలిన మొత్తంలో నుంచి రూ.10,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదే సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతినిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు అధికారిక వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.

ఫిర్యాదుదారులు మరియు బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

Share this post

23 thoughts on “ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి

  1. I’ll immediately snatch your rss as I can’t find your email subscription hyperlink or e-newsletter service. Do you have any? Please permit me know so that I may just subscribe. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల