Headlines

కిట్స్ వరంగల్‌లో యూనియన్ బడ్జెట్ 2026–27పై సెమినార్


వరంగల్, ఫిబ్రవరి 20, 2026:
వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) లోని ఎంబీఏ (మేనేజ్‌మెంట్) విభాగం ఆధ్వర్యంలో “యూనియన్ బడ్జెట్ 2026–27” పై సెమినార్‌ను గురువారం సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా భారత అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ శ్రీ చి.వి. సాయి ప్రసాద్ హాజరై బడ్జెట్‌పై విశ్లేషణాత్మక ఉపన్యాసం అందించారు.
ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 30 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని, 2047 నాటికి 60 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని తెలిపారు. సాంకేతిక అభివృద్ధి దిశగా “వికసిత భారత్” కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో విద్యార్థులను గ్లోబల్ ప్రొఫెషనల్ మేనేజర్లుగా తీర్చిదిద్దడంలో బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
‘ఆరెంజ్ ఎకానమీ’ ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ యువతలో సృజనాత్మకత, మేధస్సు, కంటెంట్ రచన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు కిట్స్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే మరియు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ ఎంబీఏ విభాగం అధ్యాపకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగాధిపతి డా. పి. సురేందర్, రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పీఆర్‌ఓ డా. డి. ప్రభాకరాచారి, అన్ని డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు డా. జి. రత్నాకర్, డా. సునీత చక్రవర్తి, డా. ఎస్. సారిక, కె. శశాంక్, డా. కె. జైపాల్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 130 మంది ఎంబీఏ మరియు ఎం.టెక్ విద్యార్థులు  పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల