కిట్స్ వరంగల్‌ ఎన్సీసీ క్యాడెట్లకు సత్కారం: బీ సర్టిఫికెట్లు పొందిన35 మంది విద్యార్తులు

వరంగల్, ఏప్రిల్ 24:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్‌ ఎన్సీసీ విభాగానికి గుర్తింపు లభించింది. ఈ కళాశాల నుండి మొత్తం 35 మంది ఎన్సీసీ క్యాడెట్లు బీ సర్టిఫికెట్లు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీ సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అఫిషియేటింగ్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విజయ్ కుమార్ చేతుల మీదుగా క్యాడెట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (IRE) లో నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీ.టెక్ విద్యార్థులే ఈ ఘనతను సాధించారని ప్రకటించారు.

ఇదే సందర్భంగా, 2025 రిపబ్లిక్ డే క్యాంప్‌లో న్యూఢిల్లీకి వెళ్లిన B.Tech రెండవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్-ఎఐ & ఎంఎల్ విద్యార్థి ఎదుల వినయ్ కుమార్ ప్రధానమంత్రి గారికి వందనం సమర్పించారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, కిట్స్ విద్యార్థులు ప్రతిభావంతులే కాక, క్రమశిక్షణతో కూడిన సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే వారు అని కొనియాడారు. యువత తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేందుకు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కళాశాల యాజమాన్యం తరఫున చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పి. నారాయణరెడ్డి, అడిషనల్ సెక్రటరీ వి. సతీష్ కుమార్ తదితరులు క్యాడెట్లను అభినందించారు. వారి విజయం మరింత మందిని ప్రేరేపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ ప్రొఫెసర్ కె. వేణు మాధవ్, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఎం. శ్రీలత, అసోసియేట్ డీన్ ఎం. నర్సింహరావు, ఎన్‌సిసి ఆఫీసర్ కెప్టెన్ ఎం. రణధీర్ కుమార్, పిఆర్ఓ డాక్టర్ డి. ప్రభాకర చారి తదితరులు పాల్గొన్నారు. పలు విభాగాల డీన్‌లు, హెడ్‌లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE