భారత్ మెరుపుదాడులతో వణికిపోతున్న పాకిస్తాన్-ఫరారైన ప్రధాని షెహబాజ్ షరీఫ్
భారత్ దెబ్బకు తట్టుకోలేక పోతున్న పాకిస్తాన్
ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం
బచావ్ అన్నా కనీసం సానుభూతి చూపని అగ్రరాజ్యాలు
పాకిస్తాన్ తో పూర్తిగా తేల్చుకునేందుకే సిద్దపడిన భారత్
పహల్గాం లో భారత టూరిస్టులపై ఉగ్రదాడి చేయించిన పాకిస్తాన్, ఇప్పుడు దాని తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది. ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ వణికి పోతోంది. ఈ దాడుల్లో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి.
భారత వైమానిక దళాలు పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వ్యూహాత్మక మెరుపుదాడులు నిర్వహించాయి. ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో జరిగిన దాడి కారణంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వెలువడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం ఆయన తన ఇంటిని ఖాళీ చేసి బంకర్లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది.
ఇక సరిహద్దుల్లో పాకిస్తాన్ చేసిన కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ కాల్పుల మధ్యలో పాక్ కు చెందిన 8 డ్రోన్లు, మూడు యుద్ధవిమానాలు కూల్చివేయబడ్డాయి. ఒక పైలెట్ను బందీగా పట్టుకున్నట్టు కూడా సమాచారం.
పాకిస్తాన్ retaliatory చర్యల్లో భాగంగా జమ్ము, పఠాన్కోట్, ఉధంపూర్లో దాడులు చేసింది. అయితే భారత సైన్యం పాక్ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసింది. గురువారం రాత్రి భారత్ మరోసారి ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ ప్రాంతాలపై మిస్సైల్ దాడులకు దిగింది.
ఈ ఉదంతాలతో పాకిస్తాన్లో భయం చుట్టుముట్టింది. మరోవైపు జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత భూభాగంలోకి చొరబాటు యత్నించిన పాక్ సైనికులను భారత దళాలు వెనక్కు నెట్టాయి.
దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించగా, విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాల్లో సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు.
భారత్ చేపట్టిన ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ రాజకీయంగా, సైనికంగా కుదేలవుతున్నది. బచావో అంటూ పాకిస్తాన్ ఈవిషయంలో అమెరికా,చైనా వంటి అగ్ర దేశాలను అభ్యర్థించినా కనీసం సానుభూతి కూడ లభించలేదు. ఉగ్రచర్యలను ఎట్టిపరిస్థితుల్లో సమర్దించబోమంటూ అమెరికా ముఖంపైనే బల్లగుద్ది చెప్పింది. పాకిస్తాన్ ఉగ్ర వాదులకు కేంద్రంగా మారిందని అమెరికా అగ్రహం వెల్లగక్కింది. ఇకచైనా అయితే భారత్ తో వాణిజ్య ప్రయోజనాల కారణంగా ఎటూ తేల్చుకోలేక మౌన ముద్ర దాల్చింది.
భద్రతా దళాల దూకుడు – పాక్ వాయుసేన, డ్రోన్లను నేలకూల్చిన భారత్
భారత్ చేపట్టిన ఈ ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్కు చెందిన ఎనిమిది డ్రోన్లు, మూడు యుద్ధ విమానాలను భారత సైన్యం గాల్లోనే ధ్వంసం చేసింది. అంతేకాక, ఒక పాకిస్తాన్ పైలెట్ను బంధించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.
దీనికి ప్రతీకారం తీసుకునే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. అయితే భారత భద్రతా బలగాలు ముందుగానే అప్రమత్తమై అన్ని మిస్సైళ్లు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ ప్రయోగించిన కొన్ని రాకెట్లు కూడా లక్ష్యాన్ని తాకక ముందే నశించిపోయాయి.
ఇస్లామాబాద్పై దాడులు –
దేశవ్యాప్తంగా హై అలర్ట్
గురువారం రాత్రి జరిగిన మరో దాడిలో భారత్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు లాహోర్, కరాచీ, సియాల్కోట్ వంటి కీలక నగరాల్లోని పలు ఆర్మీ, వాయుసేన స్థావరాలపై దాడులకు దిగింది. ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం మౌనంగా మారిపోయింది. షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లారని, ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడిందన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సరిహద్దుల్లో హై అలర్ట్ – ప్రజలకు సూచనలు
ఇక, పాకిస్తాన్ నుంచి మళ్లీ ఎలాంటి దాడులు జరగొచ్చన్న అనుమానంతో భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
అంతేకాక, ఢిల్లీ, హర్యానా, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భద్రతను పటిష్టం చేశారు. అన్ని విమానాశ్రయాల్లో సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, పోలీసుల, వైద్యుల, ఇతర అత్యవసర సేవల కార్మికుల సెలవులు రద్దు చేశారు.
ఇక పాకిస్తాన్ ఖేల్ ఖతం….
ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత్ తోచెలగాటం అడుతున్న పాకిస్తాన్ కు ఈసారి పూర్తిగా మూడినట్లేనని ప్రపంచవ్యాప్తంగా మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. ఉగ్ర వాదాన్ని రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటూ ఎన్నేళ్లుగానో భారత్కు చికాకు కలిగిస్తోన్న పాకిస్తాన్కు ఇలా తగిన శాస్తి జరగాల్సిందేనని అభిప్రాాయాలు వ్యక్తం అయ్యాయి. మొదటి సారి ఈ స్థాయిలో ప్రత్యక్షంగా ఉగ్ర స్థావరాల మీద దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఇప్పుడు అత్యంత దారుణ పరిస్థితి ఎదుర్కుంటోంది.