కిట్స్‌ వరంగల్‌లో ‘రిజాల్వ్ -2026’ హ్యాకథాన్‌

కిట్స్‌ వరంగల్‌లో ‘రిజాల్వ్‌-2026’ హ్యాకథాన్‌

వరంగల్‌, సెప్టెంబర్‌ 19: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (కిట్స్‌), వరంగల్‌లోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌ (ECEA) ఆధ్వర్యంలో శనివారం న్యూ సెమినార్‌ హాల్‌లో ‘రిజాల్వ్‌-2026’ పేరిట ఒకరోజు హ్యాకథాన్‌ను నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆచరణాత్మక నైపుణ్యాలు, బృందపని, సాంకేతిక ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు వాస్తవ ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రూపొందించేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా కిట్స్‌ వరంగల్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాస్తవ జీవిత సమస్యల పరిష్కారానికి అన్వయించుకునేందుకు హ్యాకథాన్‌లు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. ఆలోచనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చే క్రమంలో విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

‘రిజాల్వ్‌-2026’లో స్మార్ట్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌, ఫిన్‌టెక్‌, స్మార్ట్‌ సిటీస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సస్టెయినబిలిటీ అండ్‌ ఎనర్జీ, ఇండస్ట్రీ 4.0, ఎడ్యుకేషన్‌ అండ్‌ అసిస్టివ్‌ టెక్నాలజీ అనే ఎనిమిది ప్రధాన అంశాలపై సమస్యలను అందించారు. విద్యార్థులు వాస్తవ ప్రపంచ సవాళ్ల ఆధారంగా సమస్యలను ఎంపిక చేసుకుని ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT), మెషిన్‌ లెర్నింగ్‌ (ML), IoT-ML ఇంటిగ్రేషన్‌, ప్రోటోటైపింగ్‌, సిమ్యులేషన్‌ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి వినూత్న పరిష్కారాలను రూపొందించారు.

ECE అసోసియేషన్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ జి. రాఘోత్తం రెడ్డి అధ్యక్షోపన్యాసంలో మెంటార్‌షిప్‌, అనుభవాధారిత అభ్యాసం ప్రాధాన్యతను వివరించారు. తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక అంశాలను వాస్తవ సమస్యలకు అన్వయించడంతో పాటు వివిధ విభాగాల సాంకేతికతలను సమన్వయం చేసుకునే అవకాశం ‘రిజాల్వ్‌-2026’ ద్వారా విద్యార్థులకు లభించిందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లుగా డాక్టర్‌ కె. సౌజన్య, శ్రీ ఎ. పవన్‌, డాక్టర్‌ ఎం.డి. అబ్దుల్‌ ముకీమ్‌, శ్రీమతి ఇ. సుస్మిత వ్యవహరించారు. ప్రొఫెసర్‌ బి. రామాదేవి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మరియు PRO, డాక్టర్‌ డి. ప్రభాకర చారి, శ్రీ ఇ. సురేష్‌, డాక్టర్‌ ఎస్‌.పి. గిరిజ, శ్రీమతి ఎ. విజయ, డాక్టర్‌ ఎం. రాజు, డాక్టర్‌ వి. వెంకటేశ్వర్‌ రెడ్డి, డాక్టర్‌ ఎస్‌. ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ జె. తరుణ్‌కుమార్‌, డాక్టర్‌ ఎ. శ్రీనివాస్‌ తదితరులు కార్యక్రమ విజయవంతానికి సహకరించారు.

విద్యార్థి కోఆర్డినేటర్లుగా ప్రెసిడెంట్‌ ఎం. స్మరణ, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎ. ముజామిల్‌, చి. సిద్ధార్థ, ఎ. రోహక్‌, అఖిలేష్‌ తదితరులు కీలకంగా వ్యవహరించారు. 100 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని హ్యాకథాన్‌ను విజయవంతం చేశారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం