రేవంత్ రెడ్డి పాలనలో వికలాంగులకు స్వర్ణ యుగం

minister

 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వికలాంగుల సంక్షేమం కోసం సంతకం చేసి భారత దేశంలోనే మొదటి ముఖ్యమంత్రిగా నిలిచిన రేవంత్ రెడ్డి పాలనలో వికలాంగులకు స్వర్ణ యుగం ప్రారంభమైందని సాంఘీక సంక్షేమ, వికలాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రముఖ మానవతా వాది, వికలాంగుల హక్కుల కోసం త్యాగపూరిత ఉద్యమం చేసిన హెలెన్  145 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ మలక్ పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హెలెన్ కిల్లర్ కు పూలమాల వేసి మంత్రి మాట్లాడారు. 
తెలంగాణ రాష్ట్ర వికలాంగులందరికి హెలెన్ కిల్లర్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు ఆవరణలో ఉన్నా బధిరుల స్కూల్ విద్యార్థుల స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలసి భోజనం చేశారు. అట్టడుగు వర్గాల నుండి, పేద కుటుంబాల నుండి వచ్చిన నాకు సామాన్యుల బాధలు తెలుసునని నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంక్షేమ శాఖలను  కేటాయించారని అన్నారు. హాక్కులను కాపాడతానని, వికలాంగులకు పెద్దన్నలాగ అనుక్షణం తోడుగా ఉంటానని అన్నారు.  వికలాంగులతో ప్రత్యేక సమావేశం ఏర్పరిచి సమస్యలును పరిష్కారం చేస్తానని అన్నారు. గత 40  ఏండ్లు గా వికలాంగులకు అండగా ఉన్నానని ఇప్పుడు కూడా వికలాంగుల కుటుంబంలో సభ్యుడిగా రేవంత్ రెడ్డి అండతో వికలాంగుల అభివృద్ధిలో ముందుంటానని అన్నారు.

గత ప్రభుత్వం వికలాంగుల కార్పొరేషన్ కు 10 ఏండ్ల లో 64 కోట్లు కేటాయిస్తే రెండు సంవత్సరాలు లోనే 100 కోట్లు కేటాయించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దని అన్నారు. హెల్లేన్ కిల్లర్ పుట్టు మూగ, చెవుడు, అందురాలైనా కూడా వెనుకడుగు వేయకుండా రచయితగా, విద్యావేత్తగా, సామాజిక హక్కుల ఉద్యమకారిణిగా 19 వ శతాబ్దములోనే రెండవ పవర్ ఫుల్ వ్యక్తిగా చరిత్ర సృష్టించి మానవాలికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే వికలాంగుల సోదరి రజినికి ఉద్యోగం ఇచ్చి చరిత్రలోనే వికలాంగులకు ఆపద్బాంధవుడిగా చరిత్ర సృష్టించారని అన్నారు. మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కూడా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 2367 స్వయం సహాయక సంఘాలను ప్రోత్సాహమిస్తూ వికలాంగుల సమూహలను, వికలాంగుల కుటుంబాలను ఆర్థికంగా వృద్ధి చెందడమే లక్ష్యంగా 3 కోట్ల 55 లక్షల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులపై, వికలాంగుల వ్యక్తి గత సమృద్ధి కోరకు 5 కోట్ల రూపాయల ఫైలుపై సంతకాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలా చేసిన మొదటి మంత్రివర్యులుగా చరిత్ర సృష్టించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగుల పెద్దన్న రేవంత్ రెడ్డీ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమంలో వినూత్న మార్పులు చేశామని వాటిలో వికలాంగుల కి 40 శాతం వైకల్యంకే ఉచిత పరికరాలు (ట్రై మోటారైజ్డ్ స్కూటర్లు) అందించేలా జి ఒ నెంబర్ 89 తో పాటు వికలాంగులను వికలాంగులు పెండ్లి చేసుకుంటే లక్ష రూపాయలు అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు.
వికలాంగులకి ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్, కోర్టు ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్, నిరుద్యోగులకు ప్రత్యేక జాబ్ పోర్టల్, వికలాంగుల సహకార సంస్ధలో వికలాంగ ఉద్యోగులకు 15 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న 2010, 2015, 2020 పి ఆర్ సి నీ,.హైదరాబాద్ జిల్లాలో ఏడు ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న 18 మంది వికలాంగులకు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను, ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం రిజర్వేషన్ నీ, రాజీవ్ యువ వికాసం లో 5 శాతం రిజర్వేషన్, అన్ని పోలీస్ స్టేషన్లలో పకడ్బందీగా వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం రక్షణ కల్పించేలా ఉత్తర్వులతో
పాటు ఇప్పటికే అనేక అంశాల్లో వికలాంగుల సంక్షేమం కోసం ఉత్తర్వులను ఇచ్చి అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధికి అనుక్షణం సిద్దంగా ఉన్నామని, ఇప్పటికే కొత్త ప్రభుత్వంలో వికలాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ తో పాటు వివిధ హోదాల్లో ఉన్నా అధికారులు, దాదాపు 1500 మంది వికలాంగులతో పాటు రాష్ట్రములోని అన్నీ వికలాంగుల సంఘాల నాయకులు, మలక్ పేట్ కాంటెస్డ్ ఎమ్మెల్యే అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE