యువరాణి నీలోఫర్ జీవితం ఆసక్తి దాయకం


హైదరాబాద్ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన యువరాణి నీలోఫర్
ఆసక్తిదాయకం నీలోఫర్ జీవితం


   రాజులన్నా, రాజరిక రహాస్యాలన్నా, ప్రతీ ఒక్కరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రపంచంలోని రాజుల్లో అత్యంత ధనవంతుడిగా ఉన్న 7 వ నిజాం నవాబ్ పాలనా, వ్యక్తిగత జీవన శైలీ, ఆయన భార్యలు, కుటుంబ సభ్యుల జీవన విధానం పై అందరికీ ఆసక్తి  ఆసక్తికరంగానూ ఉంటుంది. దీనిలో భాగంగా ఏడవ నిజాం మీర్ మహమ్మద్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇద్దరు కొడుకులైన మోహ్జామ్ జా, అజాం జా లిద్దరూ సుఖ పురుషులుగా చెలామణి అయ్యారు. వీరి విలాస జీవితం, వ్యక్తిగత వైవాహిక జీవితం, వీరి తండ్రి మీర్ ఉస్మాన్ అలీఖాన్ లతో ఉన్న సంబంధాలు... అలా అన్నీ కొద్దిగా లోపలి తొంగి చూస్తే ప్రతీ అంశం అత్యంత ఆసక్తి కరంగా ఉంటాయి.
     దీనిలో భాగంగా, మొత్తం నిజామ్ ఖాన్-దాన్  లోనే  7 వ నిజామ్ చిన్న కొడుకైన  అజాం జా భార్య ప్రిన్స్ నీలోఫర్ ది ప్రత్యేక వ్యక్తిత్వం. ఈమె జీవితం మొత్తం ఆసక్తికరంగానూ, సేవాత్పరతకు చిహ్నంగానూ, అంతర్గతంగా తెలియని వెలితితో ఉండే నీలోఫర్ అప్పట్లో ప్రపంచంలోనే గొప్ప అందగత్తె లా భావిస్తారు. 

నీలోఫర్ గురించి

 యువరాణి నీలౌఫర్ 4 జనవరి 1916న ఇస్తాంబుల్‌లోని గోజ్‌టేప్ ప్యాలెస్‌లో జన్మించింది. ఆ సమయంలో ఆమె తల్లి కుటుంబం ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తోంది. డిసెంబర్ 1918లో, రెండు సంవత్సరాల వయస్సులో, ఆమె తన తండ్రిని కోల్పోయింది. మార్చి 1924లో ఒట్టోమన్  సామ్రాజ్య కుటుంబం బహిష్కరణ సమయంలో, ఆమె తన ఆమె తల్లి ఫ్రాన్స్‌లో వెనీస్ నగరంలో స్థిరపడ్డారు.
    1931లో ఒట్టోమాన్ దేశస్తుడైన ఖలీఫా అబ్దుల్‌మెజిద్  తన ఏకైక కుమార్తె దుర్రుషెవర్ సుల్తాన్‌ ను హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ పెద్ద కుమారుడు ఆజం జా కు, తన బంధువైన (మేన కోడలు )  నీలోఫర్ ను రెండవ కుమారుడు మోజమ్ జాతో వివాహం జరిపించారు ఖలీఫా. 12 నవంబర్ 1931న, పదహారేళ్ళ వయస్సులో నీలోఫర్ వెనిస్ లోని విల్లా కరాబాసెల్‌లో మోజామ్ జాను వివాహం చేసుకుంది. ఈ వివాహాలకు అక్కడి స్థానిక వార్తాపత్రికలు వారి ఫోటోలతో నింపి వేసాయి. మత పరమైన వివాహ వేడుక తర్వాత, కొత్తగా పెళ్లయిన వారు తమ వివాహాన్నిచట్టబద్దత  చేయడానికి బ్రిటిష్ కాన్సులేట్‌కు వెళ్లి, వారి వివాహ ఒప్పందాన్ని అధికారికంగా ద్రువీకరించుకున్నారు. దీని ప్రకారం, విడాకులు లేదా భర్త మరణించిన సందర్భంలో నీలోఫర్ డెబ్బై ఐదు వేల డాలర్లు పరిహారంగా అందుకుంటారని ఆ వివాహ ఒప్పంద రిజిస్ట్రేషన్ లో పేర్కొన్నారు..
        నీస్‌ లో వివాహ వేడుకల  తరువాత, యువరాణులు మరియు వారి భర్తలు 12 డిసెంబర్ 1931న వెనిస్ నుండి భారతదేశంలోని హైదరాబాద్‌లోకి  బయలుదేరారు. వీరు సముద్రయానం లో ఓషన్ లైనర్ పిల్సన్ అనే ఓడ లో ప్రయాణం చేశారు. అదేసమయంలో మహాత్మా గాంధీ 1931లో లండన్‌లో జరిగిన రెండవ రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన తర్వాత ఇదే ఓడ ఎక్కి, తిరిగి భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఓడలో మహాత్మా గాంధీ అందులోనే ఉన్న యువరాణులతో సమావేశమయ్యారట. ఈ సందర్బంగా, భారతీయ స్త్రీలు ధరించే చీరల ప్రాశస్త్యం, వాటిని  ఎలా ధరించాలో, నిజాం సమక్షంలో ఏవిధమైన మర్యాదలతో ఉండాలో అవగాహన కల్పించారట.. బొంబాయిలో దిగిన తర్వాత నిజాం కు చెందిన ప్రత్యేక ప్రైవేట్ రైలు లో ఎక్కి హైదరాబాద్ కు వచ్చారు.
వీరితో,  నీలోఫర్ తల్లి కూడా ఆమెకు తోడుగా వచ్చింది. ఆమె ముందుగానే ఊహించిన గర్భధారణకు సహాయం చేయడానికి ఒక మంత్రసాని అయిన ఒక ఫ్రెంచ్ మహిళను కూడా వెంట తీసుకు వచ్చింది. ఈ యువరాణులు హైదరాబాదు వచ్చినప్పుడు వారికి ఘన స్వాగతం లభించింది. 4 జనవరి 1932న చౌమహల్లా ప్యాలెస్‌లో విందు జరిగింది. ఆ తర్వాత నీలోఫర్, మౌజమ్ జా నౌబత్ పహాడ్‌లోని హిల్ ఫోర్ట్ భవనంలో స్థిరపడ్డారు.
    ఇలా, సమయం గడుస్తున్నాయి  పిల్లలు లేకపోవడంతో నీలోఫర్ వ్యక్తిగత జీవితం శూన్యంగా కనిపించగా, ఆమె తన  జీవితాన్ని ఎక్కువగా సమాజ సేవలోనే  గడిపేది.. ఆమె ఎలైట్ ఉమెన్స్ క్లబ్, లేడీ హైదరీ క్లబ్‌లో భాగస్వామిగా ఉంది.. తన కుటుంబంలోని ఇతర స్త్రీల మాదిరిగా కాకుండా (టర్కీలోని ఆమె పుట్టిన కుటుంబం మరియు భారతదేశంలోని ఆమె వైవాహిక కుటుంబం రెండింటికీ భిన్నం) తమ గౌరవం మరియు గౌరవం తమను తాము బహిరంగంగా ప్రదర్శించకుండా ఉండటమేనని భావించారు, నీలోఫర్ చాలా స్వేచ్ఛగా నగరంలో తిరగడానికి ఇష్టపడింది, పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌లు, కాక్‌టెయిల్ పార్టీలు మరియు అర్థరాత్రి ఉల్లాసానికి హాజరయ్యేందుకు తరచుగా ప్యాలెస్ జెనానా నుండి బయలుదేరడంతోపాటు. ఆమె అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. అనేక సామాజిక  కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.  హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన మరే ఇతర మహిళ కాక్‌టెయిల్ పార్టీలకు లేదా అధికారిక బహిరంగ కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు. నీలోఫర్‌ స్త్రీల అభ్యున్నతికి టార్చ్‌ బేరర్‌గా గుర్తింపు పొందింది. ఆమె అందం మరియు చురుకైన ప్రజా జీవిత విశేషాలు  ప్రస్తావించబడింది మరియు ఆమె మ్యాగజైన్‌ల కవర్ పేజీలలో ప్రదర్శించబడింది. ప్రపంచంలోని 10 మంది అందమైన మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తించేవారు..  
     నీలోఫర్ మరియు దుర్రు షెవర్ నిజాం గృహానికి చాలా ఆధునికతను తీసుకువచ్చారు. బాగా చదువుకున్న, అధునాతనమైన మరియు పాశ్చాత్యీకరించబడిన వారు హైదరాబాద్‌లోని మహిళలను బురకాల నుండి బయటకు రావాలని ప్రోత్సహించారు. తమ కోడళ్ల సామాజిక సేవను చూసి గర్వించే నిజాం బహిరంగ కార్యక్రమాలకు వారితో పాటు వెళ్లేవారు. నిజాంను 'పాపా' అని సంబోధించిన ఏకైక వ్యక్తి నీలోఫర్, అతని స్వంత కుమార్తెలు కూడా అతన్ని 'సర్కార్' అని మాత్రమే సంబోదించేవారు..
   మార్గరెట్ ఇ కజిన్స్ స్థాపించిన జాతీయ సంస్థ ఇండియన్ ఉమెన్ కాన్ఫరెన్స్ (ఐడబ్ల్యుసి) హైదరాబాద్ చాప్టర్‌కు నీలోఫర్ చాలా కాలం అధ్యక్షురాలిగా ఉన్నారు. సరోజినీ నాయుడు కుమార్తె పద్మజ నాయుడు, హైదరాబాద్‌లో నీలోఫర్‌కి మంచి స్నేహితురాలు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, ఆమె నర్సుగా శిక్షణ పొందింది మరియు సహాయక చర్యలలో సహాయం చేసింది.
           1949లో యువరాణి పరిచారికలలో ఒకరైన రఫతున్నీసా బేగం అనే మహిళా వైద్య సదుపాయాల కొరత కారణంగా ప్రసవ సమయంలో మరణించారు. తన ప్రియమైన పనిమనిషి మరణవార్త విన్న యువరాణి చాలా కుంగిపోయింది. ఇకపై ఏ తల్లికీ మరణం రాకూడదని ఆమె నిర్ణయించుకుంది. వైద్య సదుపాయాలు లేకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను నీలోఫర్ తన భర్తకు,కు తెలియజేసింది. ఫలితంగా నగరంలోని రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో మహిళలు, చిన్నారుల కోసం స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. నిజమే, ఆమె గౌరవార్థం ఈ ఆసుపత్రికి నీలోఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టారు. ఇప్పటికీ నీలోఫర్ పిల్లల హాస్పిటల్ కొన్ని వందల మంది చిన్నారులను ఆదుకొంటోంది.  ఆమె హైదరాబాద్‌లో నివసించినంత కాలం ఆమె తన ప్రత్యేక్ష స్థానాన్ని నిలుపుకుంది. నేటికీ, ఈ నిలోఫర్ ఆసుపత్రి బాగా ప్రసిద్ధి చెందినది మరియు రెడ్ హిల్స్ పరిసర ప్రాంతాలలో ప్రముఖ మైలురాయిగా ఉంది.
      సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నీలోఫర్ గర్భం దాల్చలేకపోయింది. ఇదే సమయంలో తన తోడి కోడలైన దుర్రే షహర్ కు  ఇద్దరు కుమారులు కలిగారు. ఆమె యూరప్‌లోని పలువురు వైద్యులను సంప్రదించింది మరియు వైద్యం కోసం అమెరికా వెళ్లాలని యోచిస్తున్న సమయంలో 1948లో, నీలోఫర్‌తో పెళ్లయిన పదిహేడేళ్ల తర్వాత ఆమె భర్త మోజమ్ జా రజియా బేగం అనే మహిళను మరో వివాహం చేసుకున్నాడు. ఈ రజియా బేగం కు వెంటనే ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. నిరాశా, నిస్పృహతో ఉన్న నీలోఫర్ ఫ్రాన్స్‌లో ఉన్న తన తల్లి వద్ద ఉండేందుకు వెళ్లింది. నాలుగు సంవత్సరాల తర్వాత నీలోఫర్ మొజాం జాతో 1952లో విడాకులు తీసుకున్నారు. ముప్పై ఆరేళ్ల వయసులో విడాకులు తీసుకున్నప్పటికీ తన సహజమైన అందంతో అక్కడి పత్రికలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అనేకసార్లు  పలు  సినిమా పాత్రలకు ఆఫర్ వచ్చినా వాటిని ఆమె తిరస్కరించింది.
      ప్రిన్స్ మోజంజా తో విడాకులుపొందిన 11 ఏళ్ల అనంతరం, 21 ఫిబ్రవరి 1963న, నీలోఫర్ పారిస్‌లో ఎడ్వర్డ్ జూలియస్ పోప్ జూనియర్‌ అనే క్రిస్టియన్ ను వివాహం చేసుకుంది. అతను ఎడ్వర్డ్ జూలియస్ పోప్ (1897-1955) మేరీ అల్లావే పోప్ (1897-1980) ల కుమారుడు. ఆమె కంటే మూడు సంవత్సరాలు చిన్నవాడు. అతను దౌత్యవేత్త, వ్యాపార కార్యనిర్వాహకుడు, స్క్రీన్ రైటర్ మరియు చలనచిత్ర నిర్మాత గా ఉన్నాడు..
     సామాన్య జీవనం కొనసాగించిన నీలోఫర్ 12 జూన్ 1989న పారిస్‌లో మరణించింది. ఈమెను పారిస్ లోని బాబిగ్నీ స్మశానవాటికలో ఖననం చేశారు. ఎడ్వర్డ్ పారిస్ వదిలి వాషింగ్టన్ తిరిగి వచ్చాడు. అక్కడ, అతను తన చిన్ననాటి క్లాస్‌మేట్ ఎవెలిన్ మడాక్స్ పోప్‌ని 1990లో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహమైన ఐదు సంవత్సరాల తర్వాత ఎడ్వర్డ్ 1995లో మరణించాడు.

నీలౌఫర్ మరణించిన తర్వాత ఆమె కు వారసత్వ పరంగా వచ్చిన అరుదైన కానుకలు, ఆమె ధరించే వస్త్రాలు, సేకరించిన వస్తువులు, చీరెలను ఎడ్వర్డ్ పోప్ రెండవ భార్య ఎవెలిన్ ప్రత్యేక మ్యూజియంలో ప్రదర్శనల ద్వారా అందరికీ తెలిసేలా ప్రదర్శించి యువరాణి నీలోఫర్ వారసత్వాన్ని గౌరవించడం కొనసాగించింది. మొత్తానికి బలమైన మతపరమైన సంస్కృతీ, సాంప్రదాయాలు, కట్టుబాట్లు పాటించే నిజాం రాజ్యంలో ఉస్మాన్ అలీ ఖాన్ రెండు కోడలుగా ప్రవేశించిన నీలోఫర్ హైదరాబాద్ ప్రజలలో తనదైన ప్రత్యేకతను సాధించింది.

కన్నెకంటి వెంకట రమణ, జాయింట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్. 9849905900

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం