కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ వరకు ఉదయ్‌ కృష్ణారెడ్డి ప్రయాణం

ఒక సీఐ చేతిలో ఎదురైన అవమానం ఓ యువకుడిని ఐపీఎస్‌ అధికారి అయ్యేలా మలిచింది. ఇది ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్‌ కృష్ణారెడ్డి విజయగాథ. చిన్ననాటి లోటు, కష్టాల్లో పెరిగిన జీవితం, ప్రభుత్వ పాఠశాలలో చదువు, ఒక పక్క కుటుంబ భాద్యతలు—all these only strengthened his will.

తల్లిదండ్రులను చిన్నవయసులోనే కోల్పోయిన ఆయనను నాన్నమ్మే పెంచింది. కూరగాయలు అమ్ముతూ మనవాళ్లను చదివించిన ఆమె ఆశయమే ఉదయ్‌ విజయానికి వేదిక అయింది. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుని, కానిస్టేబుల్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. కుటుంబానికి ఓ ఆదారం దొరికిందన్న సంతోషంలో ఉండగానే, ఊహించని ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

ఒక సీఐ చేతిలో 60 మంది సిబ్బంది ఎదుట జరిగిన అవమానం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపరేషన్ మొదలెట్టాడు. మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా, నాలుగోసారి 780 ర్యాంక్‌తో రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో చేరాడు. ఐదో ప్రయత్నంలో అలిండియా 350వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు.

ఉదయ్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా అభినందించారు. ధైర్యం, కృషి ఉంటే కానిస్టేబుల్‌ నుంచే ఐపీఎస్‌ సాధ్యమవుతుందని ఉదయ్‌ నిరూపించాడని ప్రశంసించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE