లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన మిషన్ భగీరథ డిప్యూటీ ఇంజనీర్

సూర్యాపేట జిల్లా ఉప-విభాగపు మిషన్ భగీరథ సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు – ఇస్లావత్ వినోద్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఫిర్యాదుధారునిచేత గతంలో పూర్తిచేయబడిన నారాయణపేట జిల్లా మక్తల్‌లో మిషన్ భగీరథ పనులకు రూ.20,00,000/- పెండింగ్ బిల్లులను తయారు చేయడానికి లంచం డిమాండ్ చేసాడు.   మెజర్ మెంట్ బుక్లో  నమోదు చేయడానికి  అతని నుండి రూ.1,00,000/- #లంచం తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ఇస్లావత్ వినోద్ గతంలో మక్తల్ లో మిషన్ భగీరథ సహాయక కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేసి 2024 జులై లో  సూర్యాపేటకు బదిలీ అయ్యాడు.  ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన పనులకు సంబంధించిన Mesurement-పుస్తకాన్ని తన వద్దనే ఉంచుకుని పైసలిస్తేనే రికార్డు చేస్తానని లంచం కోసం డిమాండ్ చేశాడు .
ఏ ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి అయినా  లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఫిర్యాదు చేసినవారికి వివరాలు గొప్యంగా ఉంటాయని తెలిపారు.

Share this post

One thought on “లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన మిషన్ భగీరథ డిప్యూటీ ఇంజనీర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి