నేను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదు: మంత్రి సీతక్క

minister seethakka

ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి స్పందించారు.

సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లానని పత్రికల్లో వచ్చిన వార్తలపై మాత్రమే ఆయనతో మాట్లాడానని ఆమె తెలిపారు. “వార్తల్లో వచ్చిన అంశాలు నిజం కాదని, అవి అపార్థాలకు దారితీయకుండా చూడాలని మాత్రమే కోరాను. ఆలయ అభివృద్ధి పనుల చుట్టూ వివాదం ఉండకూడదు. అందుకే పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లాను. కానీ నేను ఎవరిపై ఫిర్యాదు చేయలేదు” అని మంత్రి స్పష్టం చేశారు.

“సున్నితమైన అంశం కావడంతో అపార్థాలు తొలగి పనులు వేగంగా సాగాలని కోరాను. ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవి. నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాం” అని అన్నారు.

మేడారం ఆలయ అభివృద్ధి అందరి బాధ్యత అని, దీనిపై ఎలాంటి వివాదాలు అవసరం లేదని మంత్రి సీతక్క అన్నారు.

Share this post

3 thoughts on “నేను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదు: మంత్రి సీతక్క

  1. I was very pleased to search out this internet-site.I needed to thanks for your time for this glorious learn!! I definitely enjoying every little bit of it and I’ve you bookmarked to check out new stuff you blog post.

  2. We are a bunch of volunteers and opening a brand new scheme in our community. Your web site provided us with valuable info to paintings on. You’ve performed a formidable process and our entire community will be thankful to you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన