తెలంగాణ సిఐసిగా డా. జీ.చంద్రశేఖర్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం

  • హైదరాబాద్ మే 9: తెలంగాణరాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా డా. జి చంద్రశేఖర్ రెడ్డి IFS ( Rtd) నేడు మధ్యాహ్నం 12.05 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జి.చంద్రశేఖర్ రెడ్డిచే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణ రావు,…., శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, రాష్ట్ర రైతు కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుమిదిని, విజిలెన్స్ కమీషనర్ ఏం.జీ.గోపాల్, సీ.ఏం.ఓ. అధికారులు శేషాద్రి, శ్రీనివాస రాజు, మాణిక్ రాజ్,శ్రీనివాసులు, రాజ్ భవన్ కార్యదర్శి దాన కిషోర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మహేష్ దత్ ఎక్కా, సీనియర్ ఐఏఎస్ అధికారులు రఘునందన్ రావు, బుద్డ ప్రకాష్, వినయ్ కృష్ణా రెడ్డి, అడిషనల్ ద మహేష్ భగవత్ తదితరులు హాజరయ్యారు. డా. చంద్ర శేఖర్ రెడ్డి ఈ పదవిలో మూడు సంవత్సరాలపాటు లేదా 65 ఏళ్ల వరకు ఉంటారు.
Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE