ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని నుండి లంచం తీసుకుంటూఎసీబీకి దొరికిన గ్రామ పంచాయితీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు ఇందిరమ్మ ఇండ్లు పథకం క్రింద రూ.1,00,000 మంజూరు పొందేందుకు  సంబంధించి, “ఇంటి బేస్‌మెంట్‌ ఫోటోలు తీసి, నిర్మాణ దశల  పురోగతిని యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి” అధికారిక సహాయం పేరుతో కార్యదర్శి రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు ఏసీబీ అధికారులను అశ్రాయించాడు. గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికాడు.
“ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన పక్షంలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి” అని స్పష్టం చేశారు.

Share this post

One thought on “ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని నుండి లంచం తీసుకుంటూఎసీబీకి దొరికిన గ్రామ పంచాయితీ కార్యదర్శి

  1. I like what you guys are up also. Such smart work and reporting! Keep up the excellent works guys I?¦ve incorporated you guys to my blogroll. I think it’ll improve the value of my website 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన