గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ న భూతో న భవిష్యత్తు..డిప్యూటీ సీఎం


వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న విధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలని ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

శుక్రవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో గద్దర్ ఫిలిం అవార్డుల సందర్భంగా సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం కలలను ఉపయోగించి, ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని ఆయన సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఆయన పేరిట సినిమా అవార్డులను ప్రారంభించింది ఇది రెండవ సంవత్సరం అని వివరించారు. వచ్చే ఉగాది పర్వదినం రోజు ఘనంగా గద్దర్ ఫిలిం అవార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
గద్దర్ చివరి రోజుల్లో వారితో తాను ఎక్కువ కాలం గడిపానని, వారి స్టూడియోలో అనేక ప్రయోగాత్మక పాటలు పాడారని, చివరి రోజుల్లో గద్దర్ రికార్డింగ్ స్టూడియోలో ఎక్కువ రోజులు గడిపారని డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు అవార్డులను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేవలం తెలుగు ఇండస్ట్రీకే కాదు భారతదేశంలోని వివిధ భాషలకు హైదరాబాద్ కేంద్రంగా మారాలని ప్రజా ప్రభుత్వం గొప్ప సంకల్పంతో పనిచేస్తుందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ఉండే వాతావరణ పరిస్థితులు, నిపుణులు, శాంతి భద్రతలు దేశంలోని మరే ఇతర నగరాల్లో లేవని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని హైదరాబాదును ప్రపంచ సినీ కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని ముందుకు పోతుందని తెలిపారు.
సినిమాల ద్వారా సామాజిక సందేశం ఇవ్వడంతో పాటు ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆస్కార్ వంటి ప్రపంచ స్థాయి అవార్డులను సాధించడం గర్వించదగిన అంశం అటువంటి అంశాలను పునాదిగా చేసుకుని హైదరాబాదును ప్రపంచ సినీ కేంద్రంగా మార్చాలని ఆలోచనల తో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు.
సినిమా పరిశ్రమకు అవసరమైన ఆర్థిక, సామాజిక, శాంతిభద్రతలపరంగా ఇంకా ఎటువంటి అవసరం అయినా అర్ధరాత్రి తమ ప్రజా ప్రభుత్వం తలుపు తట్టవచ్చని మీకోసం సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు తాను అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, శాఖ మంత్రి వెంకట్ రెడ్డి గారు అందుబాటులో లేరు మీ అందరిని ప్రోత్సహించాలనేది మా అందరి ఏకైక లక్ష్యం అనే సందేశాన్ని మీ అందరికీ తెలియజేయవలసిందిగా తనకు తెలిపారని డిప్యూటీ సీఎం వివరించారు. గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మనస్ఫూర్తిగా తీసుకొని బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తున్నారని డిప్యూటీ సీఎం అభినందించారు. సినీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, సినీ కార్మికుల కోసం, సినీ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచనలను సైతం దిల్ రాజు తమతో పంచుకుంటున్నారని డిప్యూటీ సీఎం వివరించారు. జూరీ చైర్మన్ మణిశర్మ తెలియని వారు సినీ రంగంలో లేరని, తరతమ బేధాలు లేకుండా, పారదర్శకంగా సినిమాలు చూడడమే కాదు నిష్పక్షపాతంగా అవార్డుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టాలనీ చైర్మన్ తో పాటు జూరీ సభ్యులను కోరుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మణిశర్మ, ఎఫ్డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన