డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ కు సన్మానం

విద్యా వేత్తలు రాజకీయాల్లోకి రావాలి

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

 విద్యా వేత్తలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే భారతదేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. బహుజన ఉద్యమకారుడు డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగాధిపతిగా నియామకం అయిన సందర్భంగా ఆల్ ఇండియా ఒబిసి జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన చింతం ప్రవీణ్ కుమార్ కు సన్మానం చేసి ఆయన మాట్లాడారు. చిన్న వయసు నుండే పేదరికంతో పోరాడి ఉన్నత చదువులు చదివి విద్యతో పాటు సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రవీణ్ కుమార్ రచయితగా, కవిగా ఎదిగి నేటి యువతకు ఆదర్శంగా నిలిచి కాకతీయ యూనివర్సిటీలో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఆర్ట్స్ కాలేజ్ తెలుగు విభాగానికి విభాగాధిపతిగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. తన వృత్తిలో రాణిస్తూనే ప్రజలను చైతన్యం చేసి విలువల రాజకీయ నిర్మాణానికి తన వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు బుసగొండ ఓంకార్, బీసీ జాతీయ నాయకుడు చాపర్తి కుమార్ గాడ్గే, ఆలిండియా ఓబీసీ జాక్ వైస్ ప్రెసిడెంట్ లు వల్లాల జగన్ గౌడ్, రాసమల్ల శ్రీనివాస్ సగర, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్ సగర, ఆకారపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE