వరంగల్, మే 4, 2026:
నకిలీ కరెన్సీ చలామణి మరియు మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని వరంగల్ టాస్క్ ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తుండగా, మరో ఐదుగురు తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు.
నిందితుల వద్ద నుంచి నకిలీ నోట్లు, ₹1,48,000 నగదు, సుమారు ₹28 లక్షల విలువైన ల్యాప్టాప్లు, ప్రింటర్లు, 13 సెల్ఫోన్లు మరియు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయినవారు శాగంటి కిరణ్, నీరటి శివ, నీరటి రంజిత్, గుడికందుల రవి (నర్సంపేట), పోరిక రాజ్కుమార్ @ రాజు (ఘన్పూర్, ములుగు), తనమాల రాజశేఖర్ (వేంసూర్, ఖమ్మం), ముదురుకోల యాకంబరం (తాతానగర్, భువనగిరి), చేను సాయికిరణ్ (కారకగూడెం మండలం, కొత్తగూడెం)గా గుర్తించారు.
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు कि విచారణలో ముగ్గురు నిందితులు ₹100 నోట్లను స్కాన్ చేసి ల్యాప్టాప్, ప్రింటర్ సహాయంతో నకిలీగా తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.
మరో ఐదుగురు నిందితులు ప్రజలను మోసం చేయడానికి ప్రత్యేక పద్ధతి ఉపయోగించారు. అసలు ₹500 నోట్లను అయోడిన్ ద్రావణంలో ముంచి నల్లగా మార్చి, తరువాత సోడియం థయోసల్ఫేట్ ద్రావణంలో ముంచి మళ్లీ అసలు రూపంలోకి తీసుకువచ్చే విధానాన్ని చూపించి, నల్ల కాగితాలను కూడా అదే విధంగా అసలు నోట్లుగా మార్చవచ్చని నమ్మించారు. ఈ విధంగా డబ్బులు తీసుకుని పరారయ్యారు.
ఈ నిందితులు గతంలో ఘన్పూర్ (ములుగు), మోండా మార్కెట్ (సికింద్రాబాద్), వేంసూర్, కొత్తగూడెం, కేయూసీ మరియు సుబేదారి ప్రాంతాల్లో ఇలాంటి కేసుల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చత్రినాక (హైదరాబాద్) మరియు నర్సంపేటలో కూడా మోసాలు చేసినట్లు వెల్లడైంది.
ఈ కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ బాబులాల్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఈఓ సల్మాన్ పాషా మరియు పోలీసు సిబ్బందిని సీపీ అభినందిoచారు.
నకిలీ కరెన్సీ కేసులో ఎనిమిది మంది అరెస్ట్

