జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తెలంగాణలో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ( A. Revanth Reddy )స్పష్టత ఇచ్చారు. ఏ జిల్లాను రద్దు చేయడం గానీ, కొత్త జిల్లా ఏర్పాటు చేయడం గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అనవసర అపోహలు సృష్టించవద్దని హెచ్చరించారు.
చెల్పూరు సభలో స్పష్టమైన ప్రకటన
“ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా Jayashankar Bhupalpally జిల్లా చెల్పూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. “భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెబుతున్నా… ఏ జిల్లాను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు,” అని తెలిపారు.
అయితే, ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరణ అవసరమైతే బహిరంగంగా ప్రజలకు తెలియజేసి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. “ఎవరెన్ని కుట్రలు పన్నినా, భూపాలపల్లి ప్రజలు అపోహలను పసిగట్టగలరు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం,” అని సీఎం పేర్కొన్నారు.
సింగరేణి మెడికల్ బోర్డు రద్దు? – సీఎం ఖండన
సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారనే ప్రచారాన్ని కూడా సీఎం ఖండించారు. Singareni Collieries Company Limited పరిధిలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వేలాది కార్మిక కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.
“కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ, వారసత్వ ఉద్యోగాలు పోతాయంటూ కొందరు విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయడం లేదు. కార్మికుల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తాం,” అని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారని గుర్తుచేశారు.
2027 పుష్కరాలు – భారీ ప్రణాళికలు
2027లో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. Basara Saraswati Temple నుంచి Bhadrachalam Sri Rama Temple వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులు నిర్మించి పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
అలాగే Medaram Sammakka Saralamma Jataraను దక్షిణ కుంభమేళాగా విజయవంతంగా నిర్వహించామని, గత జాతరకు 2 కోట్ల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
వరంగల్కు భారీ నిధులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి పనుల కోసం రూ. 6,116 కోట్లను కేటాయించామని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ప్రజలు, కాకతీయ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయాల పాత్ర విశేషమని, ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని పేర్కొన్నారు.


Thans foor thee auspicious writeup. It in trth ued
too bee a entertainment account it. Glnce omplicated too morte brought
agreeable from you! By thee way,how ciuld wwe keewp iin touch?
Feeel ffee too vusit mmy weeb site; txxxvideos.com (Mike)
I’m nott suree whyy but thiks wesbsite iss loading vety slow foor me.
Is anyonje elsde aving this issue orr iss itt a issu on myy end?
I’ll check bacfk later onn annd ssee if tthe probleem stilpl exists.