Headlines

ములుగు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా చంద్రకళ

ములుగు మున్సిపల్ కార్పొరేషన్ తొలి చైర్ పర్సన్ గా చింతనిప్పుల చంద్రకళ (బిసి -మున్నూరుకాపు)ప్రమాణ స్వీకారం చేశారు.
అనూహ్య పరిణామాలలో  మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.


మాజీ ఎంపీపీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన స్వర్గీయ నల్లెల్ల కుమారస్వామి కోడలు నల్లెల్ల స్వాతి చైర్పర్సన్ దక్కుతుందని ఆశించగా చివరి క్షణాల్లో చైర్మన్ పదవిని చింత నొప్పుల చంద్రకళను వరించింది.
చైర్ పర్సన్ ఎంపిక విషయంలో మంత్రి సీతక్క కీలకంగా వ్యవహరించారు.
ముందుగా నల్లెల్ల స్వాతి చైర్ పర్సన్ అవుతుందని సీతక్క స్వయంగా మాట  ఇచ్చినట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరిగింది.
అయితే కౌన్సిలర్లు గా ఎన్నికైన తర్వాత ఛైర్పర్సన్ ఎంపిక విషయం ఆలోచిస్తామని మంత్రి సీతక్క ఎవరికీ మాట ఇవ్వలేదని పార్టీ వర్గాల్లో చర్చ ఉంది.
నల్లెల్ల స్వాతి కౌన్సిలర్ ఎంపికకు మంత్రి సీతక్క ఆమె కుమారుడు సూర్య చాలా కృషి చేసారు.
నల్లెల్ల కుమార స్వామి మరణానంతరం ఆయన కుటుంబానికి మంత్రి సీతక్క అండదండగా నిలిచింది.
అయితే పార్టీ పరిస్థితుల కారణంగా మంత్రి సీతక్క తప్పని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. 
నల్లెల్ల కుమారస్వామి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి సీతక్క నచ్చచెప్పినట్లు తెలుస్తోంది.
కార్యకర్తలు ఎక్కువగా చింతనొప్పుల చంద్రకళకు ప్రాధాన్యతనిచ్చారని,
చంద్రకళ భర్త చింతనిప్పుల బిక్షపతి సీతక్కకు ప్రధాన అనుచరుడు కావడం చంద్రకళకు కలిసి వచ్చింది.
అంది వచ్చిన అవకాశాన్ని చింత నిప్పుల బిక్షపతి వదులు కోకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి చివరికి మంత్రి సీతక్క ఆశీస్సులతో తన సతీమణికి చైర్ పర్సన్ పదవి  దక్కేలా ప్రయత్నాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగాకుల అశోక్ ఇతర పార్టీ నాయకుల ఆశీస్సులు కూడా ఉండడంతో చంద్రకళ ఎంపిక సజావుగా జరిగింది.
ప్రమాణ స్వీకారం చేసిన మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్

కౌన్సిలర్లుగా ఎంపికైన అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం చైర్ పర్సన్ ఎంపిక జరిగింది. చైర్ పర్సన్ గా ఎంపికైన చంద్రకళ ప్రమాణ స్వీకారం చేశారు.

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా మహిళా చైర్ పర్సన్ గా బిసి చైర్పర్సన్ గా చంద్రకళ క్రెడిట్లను దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఆర్డీవో వెంకటేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…