లండన్, మార్చి 29, 2026:
లండన్లోని వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ నీల ప్రతిష్టాత్మకమైన ఆసియన్ రాయల్టీ అవార్డు 2026 అందుకున్నారు. వ్యాపార నాయకత్వం మరియు సమాజ సేవలో చేసిన విశిష్ట కృషికి గాను ఈ గౌరవం ఆయనకు లభించింది.
బోరెహామ్వుడ్లోని అలమ్ మానర్ (WD6 3PJ)లో ఆదివారం (29-032026) జరిగిన ఆసియన్ రాయల్టీ అవార్డ్స్ లండన్ 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఆసియా వంశజులలో ప్రతిభ, నాయకత్వం, ఆవిష్కరణలను గౌరవించే ఈ రెడ్ కార్పెట్ వేడుక ఘనంగా జరిగింది.
వరంగల్కు చెందిన శ్రీధర్ నీలా కొన్నేళ్లుగా యుకేలో స్థిరపడి, సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం విశేషం.


ఈ కార్యక్రమంలో మిసెస్/మిస్ ఆసియా ఎమ్ప్రెస్ బ్యూటీ పేజెంట్, మూడు కోర్సుల విందు, వివిధ రంగాల్లో అవార్డుల ప్రదానం కూడా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీధర్ నీలా మాట్లాడుతూ,
“ఆసియన్ రాయల్టీ అవార్డు 2026 అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. నా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. దక్షిణ భారత సమాజాన్ని ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను. ఇది దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అని తెలిపారు.
తాను సీతారామ కళ్యాణం పూజలో పాల్గొన్న అనంతరం ఈ అవార్డు కోసం ఎంపికైనట్టు జ్యూరీ నుండి సమాచారం అందిందని చెప్పారు.
ఈ అవార్డును తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం, అలాగే తన మాతృ దేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎల్లవేలలా మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖులు, స్నేహితులు శ్రీధర్ నీల ను అభినందించారు.

