జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించి ఓటేయాలని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 7:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు గత పది ఏళ్లలో జూబ్లీహిల్స్కు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు.
శుక్రవారం గాంధీభవన్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి పథంలో సాగిందని గుర్తు చేశారు. “2014 నుంచి ఈ నగరంలో అభివృద్ధి అనే మాటే వినిపించలేదు. ప్రజలు ఇప్పుడు పాలన చూసి నిర్ణయం తీసుకోవాలి,” అని అన్నారు.
సచివాలయంలోని గుడి, మసీదులను కూల్చినప్పుడు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు మౌనం వహించారో ప్రశ్నించారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా మార్చింది కాంగ్రెస్ నిర్ణయాలే అని చెప్పారు. “మేము అధికారాన్ని అప్పగించినప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చాం, కానీ కేసీఆర్ పాలనలో 8.11 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద పడింది,” అని విమర్శించారు.
కేసీఆర్, మోదీ, కిషన్రెడ్డి కలిసి గత పది ఏళ్లలో హైదరాబాద్ కోసం ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. “ప్రగతి భవన్ ప్రజలకు కాకుండా కేసీఆర్ విశ్రాంతి కోసం మాత్రమే ఉపయోగపడింది,” అని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం వల్ల ఒక్క ఉద్యోగమైనా కలిగిందా అని కూడా ప్రశ్నించారు.
“హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నది కేటీఆర్, కిషన్రెడ్డి”
మెట్రో విస్తరణ, మూసీ శుద్ధి, ఫ్యూచర్ సిటీల ప్రాజెక్టులను కేటీఆర్, కిషన్రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కారణంగా ఎల్ అండ్ టీ కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదని చెప్పారు. “ఫ్లై ఓవర్ విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ కేసీఆర్ కాలంలో ఓఆర్ఆర్ను అమ్మేశారు,” అని విమర్శించారు.
హైదరాబాద్ అభివృద్ధిలో ఉన్న అన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చినవని గుర్తు చేశారు. “వరదల సమయంలో మోదీ ప్రభుత్వం నుంచి కిషన్రెడ్డి ఏం తెచ్చారు? గత పది ఏళ్లలో ఈ ఇద్దరూ తెలంగాణకు చేసిందేమీ లేదు,” అని మండిపడ్డారు.
“హైడ్రా ద్వారా ఆక్రమణలపై ఉక్కుపాదం”
నగరాన్ని రక్షించేందుకు హైడ్రా వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. “హైడ్రా ద్వారా చెరువులు, పార్కులు ఆక్రమణల నుంచి కాపాడుతున్నాం. పేదలకు ఇబ్బంది కలిగితే వారికి న్యాయం చేస్తున్నాం,” అని చెప్పారు. ఈ వ్యవస్థలపై కేటీఆర్, కిషన్రెడ్డి కక్షగట్టారని ఆరోపించారు.
“బీఆర్ఎస్ పార్టీని హరీశ్రావు కబళించాలనుకుంటున్నాడు”
బీఆర్ఎస్లో కీలక నేతలను బయటకు పంపించింది హరీశ్రావేనని ఆరోపించారు. “కవితను కూడా పార్టీ నుంచి తొలగించారు. హరీశ్రావు కుట్రలే దానికి కారణం,” అని అన్నారు.
“కేటీఆర్ నగరానికి విషపురుగు”
హైదరాబాద్ను డ్రగ్స్, గంజాయి కేంద్రంగా మార్చిందని కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. “కేటీఆర్ విషపురుగు లాంటివాడు. నగరంలో పెరిగిన నేరాలకు ఆయనే కారణం. మేము ఈగల్ వ్యవస్థ ద్వారా డ్రగ్స్ను అరికడుతున్నాం,” అని పేర్కొన్నారు.
“కాంగ్రెస్ గెలిస్తేనే నిజమైన అభివృద్ధి”
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. “గత రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 70 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. బీఆర్ఎస్ ప్రజలకు ఉపయోగం లేని ప్రాజెక్టులే చేసింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది,” అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
బండి సంజయ్పై కౌంటర్
బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “మేము అన్ని మతాలను గౌరవిస్తాం. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. బీజేపీ ఓటమిని కిషన్రెడ్డే ఇష్టపడతారు,” అని ఎద్దేవా చేశారు.


Well said.
Everything is very open and very clear explanation of issues. was truly information. Your website is very useful. Thanks for sharing.
Good website! I truly love how it is simple on my eyes and the data are well written. I’m wondering how I might be notified whenever a new post has been made. I’ve subscribed to your feed which must do the trick! Have a nice day!