తెలంగాణ పోలీసుల ముందు ఆయుధాలతో సహా లొంగి పోయిన 47 మంది మావోయిస్టులు


హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో శనివారం 47 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టులు 32 తుపాకులతో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 515 తూటాలను పోలీసులకు అప్పగించారు.

లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు మరియు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్చార్జి హేమ్లా ఇతు @ విజ్జా, అలాగే డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లచ్చు @ మనోజ్ వంటి కీలక నాయకులు ఉన్నారు.
అప్పగించిన ఆయుధాలు

• 1 ఎల్ఎంజీ

• 4 ఏకే-47 రైఫిల్స్

• 3 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్

• 2 ఇన్సాస్ రైఫిల్స్

• 2 .410 మస్కెట్ రైఫిల్స్

• 1 8 ఎంఎం రైఫిల్

• 12 సింగిల్ షాట్ గన్స్

• 1 9 ఎంఎం పిస్టల్

• 1 రివాల్వర్

• 2 బీజీఎల్ గన్స్

• 2 ఎయిర్ గన్స్

• 1 ఎస్బీబీఎల్ గన్

దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శితో పాటు కీలక నాయకులు లొంగిపోవడంతో ఆ విభాగం దాదాపు నిర్వీర్య స్థితికి చేరుకుందని పోలీసులు తెలిపారు.

కేడర్ వివరాలు

• PLGA బెటాలియన్: 4 మంది

• DKSZC: 28 మంది

• 9వ & 30వ ప్లాటూన్లు (దక్షిణ బస్తర్ DVC): 15 మంది

మొత్తం: 47 మంది

ఇంకా తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా లొంగిపోవాలని పోలీసులు కోరారు.

అజ్ఞాతంలో మిగిలిన నలుగురు

• లక్ష్మణరావు అలియాస్ గణపతి (కేంద్ర కమిటీ సభ్యుడు)

• పసునూరి నరహరి అలియాస్ సంతోషం (కేంద్ర కమిటీ సభ్యుడు)

• జాడి రత్నా భాయ్ అలియాస్ సుజాత (స్టేట్ కమిటీ సభ్యురాలు)

• వార్త శేఖర్ అలియాస్ మంగు (స్టేట్ కమిటీ సభ్యుడు)

జనజీవనంలోకి చేరి ప్రభుత్వం అందించే లొంగుబాటు, పునరావాస పథకాల ప్రయోజనాలు పొందాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

గత రెండేళ్లలో 818 మంది మావోయిస్టులు లొంగిపోగా, 334 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం