న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 23, 2025:
కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరైనా బాధితులుగా ఉంటే వెంటనే స్పందించేందుకు, ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది.
ఇప్పటి వరకు ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఎవ్వరూ మృతులు, గాయపడ్డవారు లేదా గల్లంతైనవారుగా గుర్తించబడలేదు. అయినప్పటికీ, ఏవైనా సమాచారం అందినట్లయితే తక్షణ స్పందన కోసం ఈ హెల్ప్లైన్ యాక్టివ్లో ఉంచారు.
కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించి సమాచారం పొందవచ్చు:
శ్రీమతి వందన:9871999044.
శ్రీ హైదర్ అలీ నఖ్వీ: 9971387500.
ఈ ఘటనపై తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.