హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన *“రాజ్ భవన్, తెలంగాణ”* ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఇకపై అది *“లోక్ భవన్, తెలంగాణ”*గా పిలవబడుతుంది.
వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా దేశం ధైర్యంగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క బలం, చైతన్యం, ప్రజా విలువలను ప్రతిబింబించేలా ఈ మార్పు చేసినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త పేరైన “లోక్ భవన్, తెలంగాణ” తక్షణమే అమల్లోకి వచ్చిందని, అన్ని అధికారిక పత్రాలు, రికార్డులు, ప్రసంగాలు, సూచనల్లో ఈ పేరునే ఉపయోగించాలని ఆదేశించారు.
ఈ మార్పు ప్రజాకేంద్రిత పరిపాలనకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ రాజ్ భవన్కు కొత్త పేరుఇకపై “లోక్ భవన్, తెలంగాణ”

