కిట్స్ వరంగల్ లో ముగిసిన వరంగల్ జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ – 2025

వరంగల్: వరంగల్ జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ – 2025 ఆగస్టు 23 నుండి 24 వరకు కakatiya Institute of Technology & Science (కిట్స్ వరంగల్) ఇండోర్ స్టేడియంలో జరిగింది. విద్యార్థులు మరియు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించామని వరంగల్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యుడిటిటిఎ) అధ్యక్షులు శ్రీ అకారపు హరీష్ తెలిపారు.


ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్ శ్రీ రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ ఆడటానికి క్రీడా స్ఫూర్తి తో పాటు దృశ్య నైపుణ్యాలు అవసరమని అన్నారు. గెలుపు – ఓటములు సాధారణమని, శారీరక ఆరోగ్యం మరియు మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని సూచించారు.


అధ్యక్షులు శ్రీ అకారపు హరీష్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించామని, బాలుర, బాలికలతో పాటు పురుషుల మరియు మహిళల విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పింగిళి రమేష్ రెడ్డి, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఎం. మోహన్ రావు, డబ్ల్యుడిటిటిఎ ప్రధాన కార్యదర్శి & ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, డబ్ల్యుడిటిటిఎ వైస్ ప్రెసిడెంట్లు డా. జై సింగ్ అజ్మీరా, శ్రీ కె. సునీల్ కుమార్, కార్యనిర్వాహక సభ్యులు రవి కుమార్, కె. వెంకటస్వామి, మహేష్, అలాగే కిట్స్ డబ్ల్యు విభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పిఆర్‌ఓ డా. డి. ప్రభాకర చారి పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి
అమెరికా డాలర్ కు ఆవలివైపు….
మోడీకి ట్రంప్ చిక్కుముడి