కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS) వరంగల్‌లో “భారతీయ వ్యాపార నమూనాలు” సెమినార్



వరంగల్, సెప్టెంబర్ 9: కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW)లోని MBA విభాగం ఆధ్వర్యంలో “భారతీయ వ్యాపార నమూనాలు” పై సెమినార్ సివిల్ సెమినార్ హాల్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వి. సాయి ప్రసాద్, మాజీ డైరెక్టర్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్, హైదరాబాద్ (CAG కింద) ఉపన్యాసం ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు KITSW ఛైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, KITSW ఖజానా కార్యదర్శి పి. నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే & KITSW అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ MBA విభాగాన్ని అభినందించారు.
తన ఉపన్యాసంలో వి. సాయి ప్రసాద్ భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే వ్యాపార నమూనాలను వివరించారు. అందులో B2C మోడల్ (అమెజాన్ ఇండియా వంటి), B2B మోడల్ (ఇండియా మార్ట్), సబ్‌స్క్రిప్షన్ మోడల్ (ఇన్ఫోఎజ్), ఆన్‌డిమాండ్ మోడల్ (మేక్ మై ట్రిప్) ఉన్నాయి. అలాగే ఫ్రీమియం, యాడ్-బేస్డ్, మార్కెట్‌ప్లేస్ మోడళ్లను ఉదాహరణలతో వివరించారు. వ్యాపార నమూనా ఎంపిక కంపెనీ ఉత్పత్తి మరియు సేవలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోకరెడ్డి అధ్యక్షోపన్యాసం చేసారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు.

MBA విభాగాధిపతి డా. పి. సురేందర్, పీఆర్‌ఓ డా. డి. ప్రభాకర చారి, అధ్యాపకులు డా. జి. రత్నాకర్, డా. సునీతా చక్రవర్తి, డా. ఎస్. సారిక, కె. శశాంక్, డా. కె. జైపాల్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. సుమారు 125 మంది MBA, M.Tech విద్యార్థులు పాల్

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి