భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ నావికా స్థావరంలో భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ కల్వరి తరగతి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్పై ప్రయాణించారు. పశ్చిమ తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సముద్ర ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. సర్వసేనాధ్యక్షురాలైన రాష్ట్రపతికి ఈ ప్రయాణంలో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి తోడుగా ఉన్నారు.
కల్వరి తరగతి జలాంతర్గామిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ఈ తొలి సముద్ర ప్రయాణం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకుముందు భారత రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాత్రమే జలాంతర్గామిపై ప్రయాణించగా, ఆయన తరువాత ఈ ఘనత సాధించిన రెండవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.



Hiya very cool website!! Guy .. Beautiful .. Amazing .. I will bookmark your web site and take the feeds also…I’m glad to find so many helpful information right here within the post, we’d like develop extra strategies in this regard, thank you for sharing.