విమానాశ్రయాల అభివృద్ధిపై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య

తెలంగాణలో విమానాశ్రయాల మౌలిక వసతుల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రశ్నించారు.

ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా మౌలిక వసతుల పెంపుపై ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సామర్థ్యాన్ని 12 మిలియన్ నుంచి 34 మిలియన్‌కు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. కార్గో టెర్మినల్–2, ట్రాన్సిట్ లౌంజ్ ప్రారంభించడంతో పాటు సుమారు రూ.1,325 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపింది. ప్రధాన రహదారి విస్తరణ, బ్రావో టాక్సీవే పొడిగింపు పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే బేగంపేట విమానాశ్రయంలో రన్‌వే రీసర్ఫేసింగ్, పేవ్‌మెంట్ అప్‌గ్రేడేషన్, పెరిమిటర్ రోడ్ విస్తరణ వంటి పనులు పూర్తయ్యాయని, వీటికి రూ.42 కోట్ల వ్యయం చేసినట్లు కేంద్రం అంగీకరించింది.
తెలంగాణలో విమాన రాకపోకలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, కేంద్రం ఇప్పటివరకు దశలవారీ అభివృద్ధి పేరుతో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్నతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.

ప్రాంతీయ అనుసంధానం పెంపు కోసం మరిన్ని నిధులు, వేగవంతమైన పనులు అవసరమని, తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్రాన్ని కోరారు.

Share this post

3 thoughts on “విమానాశ్రయాల అభివృద్ధిపై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య

  1. Trong những năm đầu hoạt động, 888slot login chỉ tập trung vào việc xây dựng nền tảng kỹ thuật vững chắc và thu hút người chơi bằng các ưu đãi hấp dẫn. Sau một thời gian ngắn, nhà cái đã mở rộng danh mục trò chơi của mình, không chỉ giới hạn ở cá cược thể thao mà còn phát triển thêm nhiều trò chơi khác như poker, blackjack và slot games. TONY03-13H

  2. I haven’t checked in here for some time as I thought it was getting boring, but the last few posts are great quality so I guess I will add you back to my daily bloglist. You deserve it my friend 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం