Headlines

మిస్ వరల్డ్ పోటీ ఎలా ప్రారంభమైంది

first miss world Kiki Håkansson

హైదరాబాద్, మే 16, 2025: ప్రపంచ సుందరిని ఎంపిక చేయడమంటే కేవలం అందం,భౌతిక రూపం మాత్రమే చూడరు. అనేక విషయాలలోప్రతిభా పాటవాలు చూస్తారు.

అందం అనేదిిందులో ప్రాథమిక అంసం అయినప్పటికి తెలివితేటలు, సామాజిక బాధ్యతలలో వారి అవగాహనను పరిగణన లోకితీసుకుంటారు. ప్రపంచ వేదికగా పేరొందిన మిస్ వరల్డ్ పోటీ పోటీ ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందా.

1951లో బ్రిటన్‌లో జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్’ సందర్భంగా ఈ పోటీ మొదలైంది. ఎరిక్ మోర్లీ అనే వ్యక్తి ఈ పోటీని ప్రారంభించారు. అప్పట్లో ఇది ‘ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్’గా పిలవబడింది. బికినీని ప్రచారం చేయడానికి ఒక సరదా ఈవెంట్‌గా ప్లాన్ చేశారు. కానీ, ఈ ఈవెంట్ మీడియా దృష్టిని ఆకర్షించి, ‘మిస్ వరల్డ్’గా పేరు పొందింది. తొలి విజేతగా స్వీడన్‌కు చెందిన కికీ హాకన్‌సన్ నిలిచారు. ఆమె బికినీలో కిరీటం ధరించడం అప్పట్లో పెద్ద వివాదాన్ని రేపింది. కొన్ని మతపరమైన దేశాలు దీనిని వ్యతిరేకించాయి, ఏకంగా పోప్ కూడా బికినీని ఖండించారు. దీంతో తర్వాతి సంవత్సరాల్లో బికినీని స్విమ్‌వేర్‌తో రీప్లేస్ చేశారు.

AISHWARYA RAI MISS WORLD

ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ పోటీని మొదట ఒక్కసారి మాత్రమే నిర్వహించాలని అనుకున్నారు. కానీ, అదే సమయంలో మిస్ యూనివర్స్ పోటీ ప్రారంభం కావడంతో, ఎరిక్ మోర్లీ దీన్ని వార్షిక ఈవెంట్‌గా మార్చారు. 1959 నుంచి బీబీసీ ఈ పోటీని ప్రసారం చేయడం మొదలుపెట్టింది, దీనివల్ల దీని పాపులారిటీ బాగా పెరిగింది. 1960, 1970 దశకాల్లో బ్రిటన్‌లో అత్యధికంగా చూసిన టీవీ కార్యక్రమాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

మిస్ వరల్డ్ పోటీలో ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. 1970లో లండన్‌లో జరిగిన ఈవెంట్‌లో స్త్రీవాదులు పిండి బాంబులతో దాడి చేశారు. 1973లో విజేత అయిన మార్జోరీ వాలెస్, తన బాధ్యతలు నెరవేర్చలేక కిరీటాన్ని కోల్పోయింది. 1976లో దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు పోటీదారులు (ఒకరు తెల్ల, మరొకరు నల్ల) పాల్గొనడంతో కొన్ని దేశాలు బహిష్కరణకు దిగాయి. 2002లో నైజీరియాలో జరగాల్సిన పోటీ, అల్లర్ల కారణంగా బ్రిటన్‌కు మార్చబడింది.

ఈ పోటీ ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ నినాదంతో నడుస్తుంది. 1951 నుంచి ఇప్పటివరకు ఈ సంస్థ పిల్లల సంక్షేమం కోసం £1 బిలియన్‌కు పైగా సేకరించింది. ఇండియా ఈ పోటీలో ఆరుసార్లు విజయం సాధించింది. 1966లో రీటా ఫారియా తొలి భారతీయ విజేతగా నిలిచారు. ఆమె తర్వాత ఐశ్వర్య రాయ్ (1994), డయానా హేడెన్ (1997), యుక్తా ముఖీ (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ఈ కిరీటాన్ని సాధించారు.

మిస్ వరల్డ్ కేవలం అందాన్ని మాత్రమే కాదు, సామాజిక సేవ, తెలివితేటలను కూడా పరీక్షిస్తుంది. ఈ వేదిక ఎందరో మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం 2024లో ముంబైలో జరిగిన పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టీనా పిస్కోవా మిస్ వరల్డ్‌గా నిలిచారు.

ఈ పోటీ మనకు అందం కంటే ఎక్కువగా సమాజానికి సేవ చేసే ఆలోచనలను, బాధ్యతలను నేర్పుతుందని చెప్పవచ్చు. మీరు ఈ పోటీ గురించి ఏమనుకుంటున్నారు? మాకు తెలియజేయండి!


హైదరాబాద్, మే 16, 2025: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీల్లో ఒకటైన మిస్ వరల్డ్ 2025, 72వ ఎడిషన్‌గా హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. మే 7 నుంచి మే 31 వరకు 28 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం తెలంగాణ లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహి స్తున్నారు. విమర్శలు లెక్క చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలకు 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ ను వేదికగా చేశారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది, అక్కడ ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా (చెక్ రిపబ్లిక్) తన వారసురాలికి కిరీటాన్ని అందజేస్తుంది.

మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 110 దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ జాతీయ జెండాలతో ర్యాంప్‌పై నడిచారు. తెలంగాణ సంప్రదాయ నృత్యాలైన పేరిణి, గుస్సాడి, కొమ్ము కోయ నృత్యాలు విదేశీ అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారత్‌ను నందిని గుప్తా (రాజస్థాన్) ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఈ పోటీలు కేవలం అందాన్ని మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలిచాయి. తెలంగాణ పర్యాటక రంగాలను మిస్ వరల్డ్ పోటీదారులు బాగా ప్రమోట్ చేశారు. చార్మినార్, లాడ్ బజార్, రామప్ప ఆలయం, బుద్ధవనం, పోచంపల్లి, యాదగిరిగుట్ట ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించారు. మే 17న గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే, మే 20-21న టీ-హబ్‌లో కాంటినెంటల్ ఫినాలే, మే 22న శిల్పకళా వేదికలో టాలెంట్ ఫినాలే జరగనున్నాయి. మే 24న హైటెక్స్‌లో టాప్ మోడల్ ఫ్యాషన్ ఫినాలే, మే 25న జ్యువెలరీ షో నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో 108 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు, అయితే కొన్ని దేశాలు వివిధ కారణాల వల్ల ఉపసంహరించుకున్నాయి. ఉదాహరణకు, బెలిజ్, బల్గేరియా, టాంజానియా, స్లోవాకియా వంటి దేశాలు ఉపసంహరణకు గల కారణాలలో స్పాన్సర్‌షిప్ లేకపోవడం, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ఈ సారి పోటీదారు లేరు, అయితే ఇండియా, నేపాల్, శ్రీలంక నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ ఈ ఈవెంట్‌ను ఒక అవకాశంగా తీసుకుని, రాష్ట్ర సంప్రదాయాలను, ఆధునికతను ప్రపంచానికి చాటింది. మే 20 లేదా 21న పోటీదారులు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఇది వారికి క్రీడా సంస్కృతిని అనుభవించే అవకాశం కల్పించింది.

ఈ కార్యక్రమం భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొంత ఆందోళన కలిగించినప్పటికీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో సజావుగా సాగుతోంది.

ఈ పోటీలు ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ నినాదంతో సామాజిక సేవను ప్రోత్సహిస్తాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగా ఎన్నికైన మిస్ వరల్డ్, ఇతర విజేతలు గవర్నర్, ముఖ్యమంత్రితో రాజ్ భవన్‌లో హై టీలో పాల్గొంటారు. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ గ్లోబల్ టూరిజం హబ్‌గా మరింత గుర్తింపు పొందుతుందని ప్రభుత్వ యంత్రాంగం నమ్మకం పెట్టుకుంది.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE