రూ.250 కోట్లతో ఏర్పాట్లు – సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ
హైదరాబాద్, జనవరి 13 :
ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈసారి గత జాతర కంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.
డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.




ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీజీలు, వివిధ శాఖల కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, జిల్లా ఎస్పీ రామనాథ్ కేకన్, ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 జాతరకు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులతో విస్తృత ఏర్పాట్లు చేస్తుండటంతో దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
- “భవిష్యత్ దృష్టితో రూపొందించిన బడ్జెట్” – అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
- ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 వేడుక
- వరంగల్ యువ టెక్ నిపుణుడి ‘బాట్స్ఇన్ LLC’ ప్రారంభం
- కిట్స్ వరంగల్లో ముగిసిన MUN 2026
- త్వరలో డిజిటల్ మీడియా పాలసీ -శాసన మండలిలో మంత్రి పొంగులేటి
సమ్మక్క–సారలమ్మ జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించి రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
జాతరకు వచ్చే భక్తులకు మార్గదర్శక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక రూట్ మ్యాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కింగ్ విషయంలో వీఐపీ – సాధారణ భక్తుల మధ్య ఎలాంటి తేడా లేకుండా సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, జాతర ఏర్పాట్లకు రూ.150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణకు రూ.101 కోట్లు కలిపి మొత్తం రూ.251 కోట్లు సీఎం మంజూరు చేశారని తెలిపారు.
శానిటేషన్, తాగునీరు, టాయిలెట్లు, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మాట్లాడుతూ, జాతర ఏర్పాట్లను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు వినియోగించాలని, జాతర సమాచారానికి ప్రత్యేక యాప్, క్యూ.ఆర్ కోడ్ రూపొందించాలని సూచించారు.
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏర్పాట్ల పురోగతిని వివరించారు. ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు.


Chỉ trong 5 năm ngắn ngủi, xn88 link đã ghi nhận hơn 5,2 triệu người dùng đăng ký trên toàn hệ thống, với mức tăng trưởng trung bình 48% mỗi quý – một con số ấn tượng mà không phải tân binh nào cũng làm được. TONY02-11O
Bạn cần truy cập đúng trang chủ slot365 , sau đó điền đủ các thông tin cần thiết. Hãy đảm bảo thông tin này được nhập chính xác đầy đủ, vì đây sẽ là những thông tin quan trọng để bạn có thể đăng nhập và thực hiện giao dịch sau này. TONY03-02O
slot365 có hệ thống xếp hạng thành viên theo điểm tích lũy. Càng chơi nhiều, bạn càng lên cấp nhanh và nhận được ưu đãi riêng: quản lý tài khoản riêng, hoàn cược cao hơn, quà tặng định kỳ… TONY03-07O