హైదరాబాద్: Telangana Police Department మావోయిస్టులు జనజీవన స్రవంతి లో చేరాలని పిలుపు నిచ్చింది.
ఈ మేరకు డీజీపీ B. Shivadhar Reddy పత్రికా ప్రకటన విడుదల చేసారు.
ముఖ్యమంత్రి A. Revanth Reddy చేసిన విజ్ఞప్తిని పునరుద్ఘాటిస్తూ, అజ్ఞాతంలో ఉన్న CPI (Maoist) నాయకులు, సభ్యులు సాధారణ జీవితంలోకి రావాలని కోరారు. సమాజంలో కలిసిమెలిసి శాంతియిత జీవనం గడపాలని సూచించారు.
గత రెండు సంవత్సరాల్లో 588 మంది మావోయిస్టులు లొంగి పోయి ప్రభుత్వ పునరావాసంతో ప్రయోజనాలు పొందినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారంతా తమ కుటుంబాలతో స్వగ్రామాల్లో ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు.
ఈ విధానం అమలుతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొందరు వచ్చి లొంగి పోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాలపై మావోయిస్టులకు నమ్మకం పెరిగిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇంకా 15 మంది మావోయిస్టులు మిగిలి ఉన్నారని, వారు ముందుకు వచ్చి లొంగి పోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి తక్షణనం ఆర్థిక సహాయం అందరు చేసి పునరావాస ప్రయోజనాలు అందజేస్తామని తెలిపారు.
మారుతున్న పరిస్థితులను గుర్తించి కుటుంబాలతో కలవాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని డిజిపి విజ్ఞప్తి చేసారు.
జనజీవన స్రవంతి లో చేరాలని మావోయిస్టులకు డిజిపి పిలుపు

