లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కరీంనగర్ డ్రగ్ నియంత్రణ అధికారులు

కరీంనగర్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డ్రగ్ నియంత్రణ అధికారులు

కరీంనగర్ జిల్లా డ్రగ్స్ నియంత్రణ పరిపాలన కార్యాలయంలో పనిచేసే అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు.   ఫిర్యాదుదారునికి చెందిన ఫార్మసీ వార్షిక తనిఖీ నిర్వహించినందుకు ప్రతిఫలంగా రూ.20,000 లంచం స్వీకరించిన కేసులో ముగ్గురు వ్యక్తులnu తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ACB) అధికారులు పట్టుకుని జైలుకు తరలించారు.
ఈ కేసులో సహాయ సంచాలకుడు మర్యాల శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్, అలాగే ప్రైవేట్ వ్యక్తి పుల్లూరి రాము లు ఉన్నారు.  అవినీతి నిరోధకశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు.
అవినీతి నిరోధకశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ— ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని సూచించారు. అదనంగా,
• వాట్సాప్: 9440446106
• ఫేస్‌బుక్: Telangana ACB
• ఎక్స్ (Twitter): @TelanganaACB
• వెబ్‌సైట్: acb.telangana.gov.in
ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
అవినీతి నిరోధకశాఖ హామీ ఇస్తూ, “ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని స్పష్టం చేసారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో