లంచం తీసుకుంటూ ఎసిబి కి దొరికిన నగర పాలక ఇంజనీర్

swarupa acb trap

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు – బి. స్వరూప ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
మున్సిపల్ కాంట్రాక్టర్ పూర్తిచేసిన పనులను మెజర్మెంట్ బుక్ (ఎంబి బుక్) లో రికార్డు చేసేందుకు స్వరూప లక్ష ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసారు. దాంతో కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం స్వరూప లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హాడెండ్ గా పట్టుకున్నారు.

లంచగొండి అధికారుల పై టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (
@TelanganaACB ) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చని ఎసిబి అధికారులు తెలిపారు. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంటాయని తెలిపారు.

కరీంనగర్‌లోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం, కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్) వారి కార్యాలయంలో సహాయ ఇంజనీరు – శరత్ మరియు సీనియర్ అసిస్టెంట్ – వేణుగోపాల్‌ ఇద్దరూ ఎసిబి అధికారులకు చిక్కారు.

అద్దె కారు ఓనర్ కు సంబంధించి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అద్దె వాహన బిల్లులను సిద్ధం చేయడానికి ఈఇద్దరు అధికారులు లంచం అడిగారు. భాదితుడి నుండి రూ.8,000 వేల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు దొరికారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE