ఏసీబీ కి చిక్కిన అవినీతి ఉద్యోగులు

ఓ ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి గొర్ల పాని ఏసీబీ అధికారులకు చిక్కాడు. అయనతోపాటే జూనియర్ అసిస్టెంట్ తొట్టె దిలీప్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. మూడు నెలలపాటు సెలవులో వెళ్లిన ఉపాధ్యాయుడు ఉద్యోగములో చేరేందుకు  వినతి పత్రాన్ని స్వీకరించడానికి మరియు తదుపరి విధులలో చేరేందుకు ఆదేశాలు జారీ చేయడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.20,000 లంచం డిమాండ్ చేసారు.
ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను అశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ఏసీబీ కి పట్టుబడిన గ్రామ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి

వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భుదేరా గ్రామ పంచాయతీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓపెన్ ప్లాటుకు ఇంటి నెంబర్ కేటాయించేందుకు అతని నుండి రూ.8,000 లంచం తీసుకుంటూ దొరికారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE