రాజన్న – సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ – మల్లోజి నాగరాజు ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకొని అరెస్ట్ చేసారు.
ఓ ఫిర్యాదుధారుని భూమికి సంబంధించిన సర్వే నివేదిక (పంచనామా)ను జారీ చేయడానికి అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ.80,000/- లంచం డిమాండ్ చేసాడు. భాదితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు.
లంచం లో మొదటి విడతగా రూ.15,000/- తీసుకుంటూ సర్వెయర్ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అధికారి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని అధికారులు తెలిపారు. వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
“ఫిర్యాదుదారుల,బాధితుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు.
mmoagw