Headlines

యాసంగి లోనూ రికార్డ్ స్థాయిలో దిగుబడి

cs and uthamkumar minister

50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

130 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా

70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

తడిసిన ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు

-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

యాసంగి సీజన్ లో ఇప్పటి వరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 60.14 లక్షల ఎకరాలు సాగు చేయగా ధాన్యం దిగుబడి అంచనా 130 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు పురోగతి పై శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,పౌర సరఫరాల శాఖా ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్, డైరెక్టర్ ప్రసాద్ లతో పాటు మార్కెటింగ్, వ్యవసాయ శాఖాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుందన్నారు.

2022-23 రబీ సీజన్ లో మే 15 నాటికి ధాన్యం కొనుగోలు 25.35 లక్షలు ఉండగా 2023-24 అదే రబీ సీజన్ లో అదే మే 15 నాటికి 32.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సంవత్సరం రబీ సీజన్ లో అదే మే 15 నాటికి ధాన్యం కొనుగోళ్లు 50 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ధాన్యం దిగుబడి ప్రతిబింబిస్తుందన్నారు

పెరిగిన ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8,348 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా ఉండేందుకు గాను పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు

గత రబీ సీజన్ తో పోల్చి చూస్తే ఈ రబీ సీజన్ లో అదనంగా 1,311 కొనుగోలు కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేశామన్నారు

ధాన్యం కొనుగోలులో రానున్న 10-12 రోజులు కీలకం అని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు

ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ప్రభుత్వం నిర్దేశించుకున్న రీతిలో ఇప్పటికే 71 శాతం మేర కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామన్నారు

కొనుగోలు ప్రక్రియ సునిశితమైనందున ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు

తాజాగా అక్కడక్కడా సంభవిస్తున్న వర్షాలకు తడిసింది అని భావిస్తున్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు

అయితే ధాన్యం కొనుగోలు అంశంలో జరుగుతున్న అసత్యపు ప్రచారాన్ని నివారించే విదంగా చర్యలు చేపట్టి రైతులకు భరోసా కలిగించాలని ఆయన అధికారులకు చెప్పారు.

తప్పుడు ప్రచారం అని నిర్దారణ జరిగితే వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేయాలని ఆయన సూచించారు

తెల్ల రేషన్ కార్డుల జారీ అంశంపై స్పందిస్తూ అర్హులైన వారి దరఖాసస్థూల పరిశీలన తుది దశకు చేరిందన్నారు.నిర్ణిత గడువు లోపు పరిశీలన పూర్తి చేయాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 90 లక్షల తెల్ల రేషన్ కార్డుల ద్వారా 2.82 కోట్ల మంది లబ్ది పొందుతున్నరన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE