సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు లో 23 మందిపై ఛార్జిషీట్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్

హైదరాబాద్, డిసెంబర్ 27, 2025: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు పురోగతికి ఏడాది కాలం పట్టింది. టాలీవుడ్ ఫేమ్ అల్లు అర్జున్ సహా 23 మంది పై ఛార్జ్ షీట్ దాఖలు చేసారు.
సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై ఈ నెల 24న స్థానిక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా స్పందిస్తూ, “సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు పూర్తయింది. డిసెంబర్ 24న 23 మంది నిందితులపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశాం” అని పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబర్ 4, 2024న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా అభిమానులు థియేటర్ వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందాడు.

ఈ ఘటన అనంతరం జనవరిలో అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీ తేజను పరామర్శించారు. అప్పటికే పలు వారాల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 24 నాటికి శ్రీ తేజ 20 రోజుల తరువాత స్పందించటం ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి తండ్రి భాస్కర్, “అల్లుఅర్జున్ గారు, తెలంగాణ ప్రభుత్వం మాకు అండగా నిలుస్తున్నారు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కేసులో అల్లు అర్జున్‌పై నమోదైన వ్యవహారంలో భాగంగా ఆయన న్యాయ ప్రక్రియలను కూడా పూర్తి చేశారు. జనవరి 4న నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో రూ.50 వేల బాండ్‌తో షూరిటీలను సమర్పించి, జనవరి 5న చీకడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరై బెయిల్ షరతులు పాటించారు. ఈ సందర్భంగా కోర్టు ఈ ఘటనను “హత్యకు సమానమైన నిర్లక్ష్య హత్య” కింద పరిగణించలేదని, అందుకే బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. కేసు కొట్టివేతకు సంబంధించిన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, తదుపరి విచారణ జనవరి 21, 2025కు నిర్ణయించారు.

తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు