Headlines

చార్మినార్ చెంత వేడుకగా సుందరాంగుల హెరిటేజ్ వాక్

చార్మినార్ అందాలకు సుందరాగుల ఫిదా

  • ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద చేరుకున్న 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్.

–మార్ఫా వాయిద్యాలతో స్వాగతం మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు స్వాగతం పలికిన స్థానికులు.

  • అరబ్బీ మర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేసిన కొందరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు.

–అందాల రాయబారూలతో చార్మినార్ పరిసరాలకు సరికొత్త శోభ .

– చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ కు హాజరైన సుందరాంగులు.

_ చార్మినార్ వేదిక నుండి ప్రజలకు అభివాదం చేసిన అందగత్తెలు

– చరవాణుల్లో చార్మినార్ అందాలను బంధించిన అందగత్తెలు.

వేడుకగా సుందరాగుల హెరిటేజ్ వాక్

–చార్మినార్ సమీపంలోని చుడీ బజారు దుకాణాల్లో గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ చేసిన అందాల భామలు.

– గాజుల తయారీని స్వయంగా పరిశీలించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు. తయారీ దారులకు ప్రశంస

హైదరాబాద్ 13, మే 2025

ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ సందర్శన
109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు
అద్భుతమైన మధురానుభూతులను మిగిల్చింది.
ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ మధ్యన ఠీవిగా నిలబడి ఉన్న ఈ సొగసైన కట్టడం ను చూసి
సుందరాంగులు మంత్రముగ్ధులయ్యారు.

సందర్శన కోసం చార్మినార్ వద్దకు పర్యాటక బస్సులతో చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లకు అధికారులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.
స్థానిక కళాకారులు వారికి సాంప్రదాయిక అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు. మార్ఫా శబ్దాలతో మమేకం చేస్తున్నట్లుగా కొందరు కంటెస్టెంట్స్ ప్రత్యేక స్టెప్పులతో నృత్యం చేసి, స్థానిక సంస్కృతికి అనుకూలంగా తాము అనునయించారు.
ఈ అందాల రాయబారులతో చార్మినార్ పరిసరాలు ఒక సరికొత్త శోభను పొందాయి. ప్రత్యేకంగా చార్మినార్ వద్ద ఫోటోషూట్ కు హాజరైన సుందరాంగులు, ఈ చారిత్రాత్మిక వేదిక నుండి ప్రజలకు అభివాదం చేస్తూ, తమ ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేశారు. చార్మినార్ అందాలను ఈ అందగత్తెలు తమ చరవాణులలో
ఫోటోలను తీసుకున్నారు.

అనంతరం ప్రపంచ అందగత్తెలు
చార్మినార్ ముందు నిర్వహించిన హెరిటేజ్ వాక్
సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలిపారు.

సందర్శనలో భాగంగా, చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ చుడీ బజార్ (లాడ్ బజార్)లో కంటెస్టెంట్స్ గాజులు, ముత్యాల హారాలు మరియు ఇతర అలంకరణ వస్తువుల షాపింగ్ చేసి, స్థానిక హస్తకళల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. కొందరు కంటెస్టెంట్స్ గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, నిపుణులైన కారిగర్లు (కళాకారులు), శిల్పులకు ప్రశంసలు తెలిపారు. వారి శ్రమ , నైపుణ్యం ప్రపంచ స్టేజిపై కూడా గుర్తించదగినదని భావించారు.

ఈ కార్యక్రమం ద్వారా, హైదరాబాద్ యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు సౌందర్యం ప్రపంచానికి తెలియజేసినట్లయ్యింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శన కేవలం పోటీలలో భాగంగానే కాకుండా, ప్రపంచ శాంతి ,సాంస్కృతిక సామరస్యానికి సాక్ష్యంగా నిలిచింది.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE