హెడ్-టు-హెడ్ విజేతలుగా ఖండాంతర ఫైనలిస్టులుగ మిస్ వేల్స్, మిస్ టర్కీ, మిస్ ట్రినిడాడ్ & టొబాగో, మిస్ జాంబియా
తెలంగాణ పై జడ్జెస్ ప్రశ్నలు
రాష్ట్ర అభివృద్ధి మహిళల భద్రతా చర్యల పై కాంటెస్టెంట్స్ హర్షం
హైదరాబాద్, 23 మే 2025: 72వ మిస్ వరల్డ్ పోటీలో భాగంగా హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్లోని హోటల్ ట్రైడెంట్లో అట్టహాసంగా జరిగింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా & ఓషియానియా, అమెరికా & కరేబియన్ నుండి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది పోటీదారులు ఈ పోటీలో తమ వాక్చాతుర్యంతో సామాజిక కోణం పై వారి అభిప్రాయాలని సామాజిక కార్యక్రమాలని తమదైనా శైలిలో జడ్జెస్ ముందు ప్రెసెంట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలో కీలకమైన విభాగం హెడ్-టు-హెడ్ ఛాలెంజ్. ఇది పోటీదారులకు కీలకమైన సామాజిక సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ప్రపంచ స్థాయి వేదికను అందిస్తుంది. ఇప్పటికే ప్రతి ఖండం నుండి హెడ్ టూ హెడ్ రౌండ్ కి ఐదుగురు ఎంపిక కాగా ఈ పోటీలో అందులో నుండి ఒరేతి కంటినంట్ నుండి ఇద్దరినీ ఎంపిక చేసి తుది రౌండ్కు వారిలో ప్రతి ఖండం నుండి ఒక విజేతను కాంటినెంట్ టాప్ 10కి ఎంపిక చేశారు.
అమెరికా కరేబియన్: తెలంగాణలో మహిళా సాధికారత భద్రత
బ్రెజిల్, సురినామ్, కేమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ & టొబాగో నుండి వచ్చిన పోటీదారులకు “హైదరాబాద్కు వచ్చిన తర్వాత, తెలంగాణలో మహిళల భద్రత మరియు సాధికారతపై ప్రపంచానికి మీరు ఏ సందేశాన్ని ఇస్తారు?” అనే ప్రశ్న అడగగ
మిస్ గయానా మాట్లాడుతూ, “మహిళలు ఎక్కడికైనా వెళ్ళగలరు, భద్రత అనేది హక్కు,” అని పేర్కొంటూ, తెలంగాణ మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి అనువైన ప్రదేశమని తెలంగాణ లో మహిళలు స్వేచ్ఛ భద్రతను ప్రశంసించారు.
కాంటినెంట్ తుది రౌండ్ విజేత గ నిలిచిన మిస్ ట్రినిడాడ్ & టొబాగో మాట్లాడుతూ, “ప్రగతి, సాధికారత ఒకటే అని. భారతదేశం, ముఖ్యంగా హైదరాబాద్, ఈ ఏ దిశగా చేయడుతున్న చర్యలు అభినందనీయం అన్నారు. సగం జనాభాను వెనుకబడి ఉంటే విజయం సాధించలేమని మహిళలును ముందుకు నడిపిస్తున్న తెలంగాణకు ధన్యవాదాలు” అని ఆమె అన్నారు.
ఆఫ్రికా కాంటినెంట్: ఎదుగుదలకు మార్గాలుగా సవాళ్లు & సోషల్ మీడియా పాత్ర
దక్షిణాఫ్రికా, నమీబియా, సోమాలియా, ఉగాండా, జాంబియా నుండి వచ్చిన ప్రతినిధులు “సవాళ్లు మీ ఎదుగుదలకు అవకాశాలుగా ఎలా మారాయి?” అనే ప్రశ్నకు స్పందించారు.
మిస్ నమీబియా తన ఆందోళన డిప్రెషన్తో వ్యక్తిగత పోరాటాన్ని పంచుకున్నారు. తనను తాను తెలుసుకోని మన లోని బలాన్ని గుర్తించి ముందుకు సాగాలన్నారు.
ఆఫ్రికన్ కాంటినెంటల్ విజేత గ నిలిచిన మిస్ జాంబియా, క్లినికల్ మెడిసిన్ పూర్తి చేసి స్కాలర్షిప్ను హైలైట్ చేస్తూ, స్పోర్తిదాయక వాక్యానం చేశారు.
తుది రౌండ్లో, ఆఫ్రికన్ ఫైనలిస్టులు “సోషల్ మీడియా జీవితంలోని అనేక అంశాలను, ముఖ్యంగా యువతలో ప్రభావితం చేస్తుంది. మీరు ఎలా ప్రామాణికంగా ఉంటారు?” అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
మిస్ జాంబియా మాట్లాడుతూ, “ప్రపంచం మారవచ్చు, కానీ మీరు మారాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే, అలా ఉండండి, మరియు ప్రపంచం దాన్ని స్వీకరించనివ్వండి. ప్రామాణికత బలం – సమాజం పరిణామం చెందవచ్చు, కానీ మన నిజమైన స్వీయత కోల్పోకూడదు” అని అన్నారు.
యూరప్: విద్య ద్వారా యువతను శక్తివంతం చేయడం..
స్పెయిన్, వేల్స్, ఫ్రాన్స్, జర్మనీ, మరియు ఐర్లాండ్ నుండి వచ్చిన ప్రతినిధులకు “మీ దేశంలో యువ జీవితాలను మెరుగుపరచడానికి మీరు ఒక మార్పును అమలు చేయగలిగితే, అది ఏమిటి మరియు ఎందుకు?” అనే జడ్జెస్ అడిగిన ప్రశ్న కు సమాధానంగా
మిస్ ఐర్లాండ్ గృహ హింసకు వ్యతిరేకంగా బలమైన రక్షణలకు మద్దతు ఇచ్చారు.
ఫైనల్స్కు చేరుకున్న మిస్ వేల్స్, ఆరోగ్య సంరక్షణ, విద్యను నొక్కి చెప్పారు. ఆమె తన కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తిగా తన ప్రయాణాన్ని మరియు ఉగాండా, భారతదేశంలో వైద్య సేవలు, ముఖ్యంగా యాసిడ్ దాడి బాధితుల కథలు, తన లక్ష్యానికి ఎలా స్ఫూర్తినిచ్చాయో పంచుకున్నారు. “విద్య అందరికీ భిన్నంగా కనిపిస్తుంది, అది అత్యంత శక్తివంతమైన సాధనం,” అని ఆమె అన్నారు.
ఆసియా & ఓషియానియా: సాంస్కృతిక గుర్తింపు మరియు ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’
శ్రీలంక, థాయిలాండ్, టర్కీ, లెబనాన్, జపాన్ నుండి వచ్చిన ప్రతినిధులు “‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్తో పనిచేయడం మీ దృక్పథాన్ని ఎలా మార్చింది?” అనే దానిపై ప్రతిస్పందించారు.
తన తల్లిని క్యాన్సర్తో కోల్పోయిన ఆంకాలజిస్ట్ మిస్ టర్కీ, తన దేశంలో మామోగ్రామ్ అవగాహనకు మద్దతు ఇస్తున్నారు. ఆమె శక్తివంతమైన వాదన ఆమెకు ఆసియా & ఓషియానియా టైటిల్ను సంపాదించిపెట్టింది.
కాంటినెంట్ తుది రౌండ్లో, పోటీదారులు “పెరుగుతున్న ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో, వైవిధ్యాన్ని స్వీకరిస్తూ సాంస్కృతిక గుర్తింపును ఎలా కాపాడుకుంటారు?” అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
మిస్ టర్కీ స్పందిస్తూ, “నేటి ప్రపంచంలో , సాంస్కృతిక వారసత్వం అత్యంత ముఖ్యమైనదిగా . కాన్సులేట్లు, రాయబార కార్యాలయాలు నిర్వహించే అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా సంగీతం, కళలు, వంటకాలు, సంప్రదాయాల ద్వారా మనం సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటమే కాకుండా, ఐక్యతను పెంపోందించుకోగలమన్నారు. సాంస్కృతిక తేడాలు అడ్డంకులు కావు, వంతెనలు” అని ఆమె అభిప్రాయ పడ్డారు.
ఖండాంతర విజేతలకు తుది ప్రశ్న: వాతావరణ మార్పు..
కాంటినెంట్ ఫైనలిస్టు ను “వాతావరణ మార్పుపై మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు.
మిస్ ట్రినిడాడ్ & టొబాగో మాట్లాడుతూ, “నేను ప్రకృతితో నిండిన భూమి నుండి వచ్చాను. మీరు దేనినైనా ప్రేమించినప్పుడు, దాన్ని కాపాడుకుంటారు. మేము పర్యావరణంతో తిరిగి అనుసంధానం కావడానికి హైకింగ్ చెట్ల నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. చిన్న అడుగులు స్థిరమైన భవిష్యత్తును నిర్మిస్తాయి” అని ఆమె అన్నారు.
తెలంగాణను ప్రపంచానికి ఎలా ప్రోత్సహిస్తారు..
చివరి నలుగురు ఖండాంతర విజేతలు — టర్కీ, వేల్స్, జాంబియా, ట్రినిడాడ్ & టొబాగో — “భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణను సంస్కృతి, వారసత్వం, మరియు ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి ఎలా ప్రోత్సహిస్తారు?” అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
మిస్ టర్కీ తెలంగాణను సాంకేతిక మరియు వైద్య ఆవిష్కరణల కేంద్రంగా హైలైట్ చేశారు. “ఇది ప్రగతిశీల, శక్తివంతమైన రాష్ట్రం, మహిళల హక్కులు, భద్రత, మరియు విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ ప్రపంచానికి సాధికారత, ఆవిష్కరణ, మరియు లింగ సమానత్వం యొక్క శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది” అని అన్నారు.
మిస్ వేల్స్ వ్యాఖ్యానిస్తూ, “తెలంగాణ గొప్ప సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి నా దేశాన్ని ఆహ్వానిస్తాను” అని అన్నారు.
మిస్ జాంబియా మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు కలలు, సంస్కృతి నిండిన వారు . నాకు వారి ప్రామాణికతను ప్రతిబింబించే అనేక బహుమతులు లభించాయి. మిస్ వరల్డ్ ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ స్లోగన్ కాగా – తెలంగాణ ఆ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో కలిగి ఉంది” అని అన్నారు.
మిస్ ట్రినిడాడ్ & టొబాగో మాట్లాడుతూ, “నా దేశం లార్డ్ అఫ్ సన్ దేశంగా ప్రసిద్ధి చెందింది తెలంగాణ కుద్క్ సన్ అఫ్ లార్డ్ అని ఇక్కడ ప్రజలు దయ, సంస్కృతి తో నిండి ఉన్నారని” అన్నారు.
జూలియన్ మోర్లే, మిస్ వరల్డ్ 2024 క్రిస్టియానా, అరుణా పారామా, మిస్టర్ వరల్డ్ ఆసియా వియత్నాం పాల్గొన్నారు.
72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో హెడ్-టు-హెడ్ ఛాలెంజ్, అందం, ఉద్దేశ్యం, మేధస్సు, సామాజిక దృక్పదం ఎలా కలసికట్టుగా మార్పు కోసం ప్రపంచ స్థాయి గొంతును సృష్టించగలవో శక్తివంతంగా ప్రదర్శించింది.