మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి

Jaishankar

దిల్లీ: రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు వైట్‌ హౌస్‌ ప్రతినిధులు చేస్తున్న విమర్శలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఘాటుగా స్పందించారు.

శనివారం దిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్‌ వరల్డ్ లీడర్స్ ఫోరంలో పాల్గొన్న ఆయన, ‘‘భారత్‌ నిర్ణయాలు ఎప్పుడూ దేశ ప్రజల ప్రయోజనాలకే అనుగుణంగా ఉంటాయి. అమెరికాకు సమస్య ఉంటే.. ఇక్కడి ఉత్పత్తులు కొనవలసిన అవసరం లేదు. బలవంతం చేసే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు.

రష్యా చమురు కొనుగోలు పై వివరణ

జైశంకర్‌ మాట్లాడుతూ, ‘‘2022లో చమురు ధరలు అమాంతం పెరిగినప్పుడు రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయడం వల్లే అంతర్జాతీయ మార్కెట్‌ స్థిరంగా నిలిచింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు’’ అని గుర్తుచేశారు. దేశ ప్రయోజనాలు, ప్రపంచ అవసరాలు రెండింటినీ దృష్టిలో ఉంచుకుని మాస్కోతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నామని వివరించారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత్‌ తన స్థానం స్పష్టంగా తెలియజేసిందని, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొందరగా తగ్గాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

ఇలాంటి వ్యక్తిని చూడలేదు…

ఈ సందర్భంగా ట్రంప్‌ విధానాలపై ఘాటుగా వ్యాఖ్యానించిన జైశంకర్‌, ‘‘ఇంత బహిరంగంగా విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్న అధ్యక్షుడిని ఇంతవరకు చూడలేదు. వాణిజ్య అంశాలతో పాటు ఇతర వ్యవహారాల్లోనూ టారిఫ్‌లను వినియోగించడం కొత్తగా అనిపిస్తోంది’’ అన్నారు.

అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, భారత రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి
అమెరికా డాలర్ కు ఆవలివైపు….
మోడీకి ట్రంప్ చిక్కుముడి