సరస్వతి పుష్కరాలుఅద్భుతం అనిర్వచనీయం-డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క

deputy cm mallu

శుక్రవారం కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా సరస్వతి తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం సరస్వతి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు నిర్వహణ అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

కాలేశ్వరంలో సరస్వతీ పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా, అనిర్వచనీయంగా ఉన్నాయన్నారు.
పుష్కర స్నానంతో సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పుష్కర స్నానంతో అవి పరిసమాప్తం అవుతాయని అన్నారు. కుటుంబంతో కలిసి సరస్వతి పుష్కర స్నానం ఆచరించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
12 రోజుల పాటు జరగనున్న పుష్కరాలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారని, వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారని రానున్న 10 రోజులు చాలా కీలకమని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఎక్కడా చిన్న లోపం రాకుండా భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని అన్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. భక్తులు సౌకర్యాలు కల్పన కు ఏర్పాటు చేసిన టెంట్ సిటీ అద్భుతంగా ఉందని అభినందించారు.

భద్రత, పారిశుద్ధ్యం, స్నానాల ఘాట్ల వద్ద ఏర్పాట్లను అధికారులు నిబద్ధత, నిష్టతో ఏర్పాటు చేశారని వివరించారు. పుష్కర స్నానాలకు ప్రతిరోజు ఒక పీఠాధిపతి వచ్చి స్నానం ఆచరించి ముక్తేశ్వర దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇదొక గొప్ప సందర్భమని అన్నారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం, భూపాలపల్లి మక్కన్ సింగ్, గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE