కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ల విజయోత్సవ సభ – స్థానిక ఎన్నికలకు శంఖారావం

rhul

హాజరుకానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే,సిద్ధరామయ్య,కేసీ వేణుగోపాల్,

కామారెడ్డి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బరిలోకి సిద్దపడుతోంది. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు పార్టీ ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 15న కామారెడ్డిలో **‘బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ’**ను అట్టహాసంగా నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. లక్ష మందికి పైగా ప్రజలను సమీకరించి సభను ఘనవిజయం చేయాలని రాష్ట్ర నాయకత్వం సంకల్పించింది.

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ జరిగింది. ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. సభా నిర్వహణ, జనసమీకరణ అంశాలపై చర్చించారు. ఆ తరువాత ఆదివారం కామారెడ్డిలో మరో సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. అనంతరం సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించనున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలోనే సిద్ధరామయ్య **‘బీసీ డిక్లరేషన్’**ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలోకి వస్తే కులగణన చేసి, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 42 శాతంకు పెంచుతూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది.

ఇప్పటివరకు హామీ ఇచ్చిన వేదికపైనే విజయోత్సవ సభ జరపడం ద్వారా బీసీ వర్గాల్లో కాంగ్రెస్ బలమైన సందేశం ఇవ్వాలని భావిస్తోంది.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి